AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Assembly Sessions: ఈ నెల 6 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఆ విషయాలపైనే ప్రధాన చర్చ..!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 3న నిర్వహించే కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు, ప్రవేశపెట్టే బిల్లులపై కీలకంగా చర్చించనున్నారు.

Telangana Assembly Sessions: ఈ నెల 6 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఆ విషయాలపైనే ప్రధాన చర్చ..!
Telangana Assembly
Shaik Madar Saheb
|

Updated on: Sep 02, 2022 | 2:52 PM

Share

Telangana Assembly sessions : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 3న నిర్వహించే కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు, ప్రవేశపెట్టే బిల్లులపై కీలకంగా చర్చించనున్నారు. ఈ నెల 6వ తేదీన ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభమవుతాయని రాష్ట్ర శాసనమండలి కార్యదర్శి వి నరసింహాచార్యులు శుక్రవారం వెల్లడించారు. అదేరోజు తెలంగాణ బీఏసీ సమావేశం కూడా జరగనుంది.అసెంబ్లీ, మండలి సమావేశాలు మార్చి 7న ప్రారంభమై మార్చి 15న ముగిసిన బడ్జెట్ సెషన్‌కు కొనసాగింపుగా ఉండనున్నాయి. బడ్జెట్ సెషన్ తర్వాత స్పీకర్ సభను వాయిదా వేశారు. సభను ప్రోరోగ్ చేయలేదు.

ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టే అవకాశం ఉంది. ఈ నెల మూడో తేదీన జరిగే తెలంగాణ కేబినెట్ సమావేశంలో.. అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అదే రోజు సాయంత్రం తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలతోపాటు దేశంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో టీఆర్ఎస్ అనుసరించనున్న పాత్రపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్ధేశం చేయనున్నారు.

వివాదాస్పద వ్యాఖ్యల అనంతరం బీజేపీ శాసనసభా పక్షనేత రాజాసింగ్‌పై పీడీయాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే, రాజాసింగ్‌ను అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని ఎంఐఎం డిమాండ్ చేసింది. ఈ విషయంపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అసెంబ్లీ వేదికగా కేంద్రంలోని బీజేపీ తీరును రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎండగట్టే అవకాశం ఉంది. దీంతోపాటు ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మరణించిన విషయం తెలింసిందే. ఈ ఘటనపై అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై విపక్షాలు ప్రశ్నించే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి