AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కల్లంలో కాలిబూడిదైన మిర్చి.. పోలీసుల విచారణలో వెలుగులోకి సంచలనాలు..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం వెంకట్రావుపేటలో మార్చి 10వ తేదీన జరిగిన మిర్చి దహనం కేసును ఎట్టకేలకు చేధించారు పోలీసులు. పినపాకలో సంచలనం సృష్టించిన ఈ కేసును వారం రోజుల్లోనే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన బాలకృష్ణ, వెంకటేశ్వర్లు అనే ఇద్దరు వ్యక్తులు వరుసకు మామ అల్లుళ్లు.

కల్లంలో కాలిబూడిదైన మిర్చి.. పోలీసుల విచారణలో వెలుగులోకి సంచలనాలు..!
Chilli Crop Burning Case
N Narayana Rao
| Edited By: |

Updated on: Mar 18, 2025 | 6:06 PM

Share

మంత్రాల చేస్తున్నాడని అనుమానం.. గ్రామంలో పెద్ద మనిషిగా ఎదుగుతూ పేరు వస్తుందనే అసూయ.. ఇవే ఆ రైతు కల్లంలోని 50 క్వింటాళ్ల మిర్చిని తగులబెట్టడానికి కారణమైంది. దీంతో ఆ రైతు అరుగాలం పండించిన పంట బూడదైంది. ఈ ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. పినపాక మండలం వెంకట్రావుపేట మిర్చి దహనం కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. మంత్రాలు చేపిస్తున్నాడని నెపంతో మిర్చి దగ్ధం చేశామంటూ నిందితులు పోలీసుల ముందు ఒప్పేకున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం వెంకట్రావుపేటలో మార్చి 10వ తేదీన జరిగిన మిర్చి దహనం కేసును ఎట్టకేలకు చేధించారు పోలీసులు. పినపాకలో సంచలనం సృష్టించిన ఈ కేసును వారం రోజుల్లోనే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన బాలకృష్ణ, వెంకటేశ్వర్లు అనే ఇద్దరు వ్యక్తులు వరుసకు మామ అల్లుళ్లు. వీరికి మిర్చి రైతు పురుషోత్తంకు మధ్య గత కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో గత సంవత్సరం బాలకృష్ణ భార్య అనారోగ్యంతో మృతి చెందింది. దానికి ప్రధాన కారణం పురుషోత్తమే అని, అతను మంత్రాలు, చేతబడి చేయించచడం మూలంగానే తన భార్య చనిపోయిందని కక్ష పెంచుకున్నాడు బాలకృష్ణ. తన మామ అయిన వెంకటేశ్వర్లు తో విషయం చెప్పగా, తన ఎదుగుదలకు కూడా పురుషోత్తం అడ్డువస్తున్నాడని వెంకటేశ్వర్లు తెలిపాడు. ఇరువురు కలిసి ఎలాగైనా పురుషోత్తం పై కక్ష తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే మార్చి 10వ తారీఖున పురుషోత్తం‌కు చెందిన కల్లంలో ఆరబెట్టిన సుమారు 50 క్వింటాల మిర్చిని పెట్రోల్ పోసి దహనం చేశారు. అనంతరం అక్కడి నుంచి జారుకున్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మంత్రాలు చేయిస్తున్నాడనే నెపంతోనే ఇద్దరు నిందితులు ఈ ఘటనకు పాల్పడ్డారని ఏడూళ్ల బయ్యారం ఎస్‌ఐ రాజ్‌కుమార్ తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
కిడ్నీ స్టోన్స్ సమస్య ఉందా? ఈ ఆహారాల విషయంలో జాగ్రత్త!
కిడ్నీ స్టోన్స్ సమస్య ఉందా? ఈ ఆహారాల విషయంలో జాగ్రత్త!
సింగిల్‌స్ట్రోక్‌తో 2 లక్షల వీసాలు చించివేత.. అమెరికాలో వీసాచికం
సింగిల్‌స్ట్రోక్‌తో 2 లక్షల వీసాలు చించివేత.. అమెరికాలో వీసాచికం
పెళ్లి కోసం వెయిటింగ్? ఈ 6 రాశులకు ఇక గుడ్ న్యూస్!
పెళ్లి కోసం వెయిటింగ్? ఈ 6 రాశులకు ఇక గుడ్ న్యూస్!
శాలరీ స్లిప్, సిబిల్ స్కోర్ లేకపోయినా పర్సనల్ లోన్ వస్తుందా..?
శాలరీ స్లిప్, సిబిల్ స్కోర్ లేకపోయినా పర్సనల్ లోన్ వస్తుందా..?
కలెక్టర్ ఉద్యోగాన్ని వదులుకుని సినిమాల్లోకి వచ్చిన నటుడు..
కలెక్టర్ ఉద్యోగాన్ని వదులుకుని సినిమాల్లోకి వచ్చిన నటుడు..
అరటి తోటలో అలికిడి.. అడుగు ముందుకేసిన రైతుకు ఎదురైన భయానక దృశ్యం!
అరటి తోటలో అలికిడి.. అడుగు ముందుకేసిన రైతుకు ఎదురైన భయానక దృశ్యం!
శ్రావణ పౌర్ణమి: రాఖీ కట్టే రోజున ఈ పనులు చేయకండి!
శ్రావణ పౌర్ణమి: రాఖీ కట్టే రోజున ఈ పనులు చేయకండి!
సప్త సముద్రాలు ఈది.. పిల్ల కాలువలో తేలిపోయిన టీమిండియా
సప్త సముద్రాలు ఈది.. పిల్ల కాలువలో తేలిపోయిన టీమిండియా
డిగ్రీ, డిప్లొమా మార్కులతో BEMLలో 1346 ఉద్యోగాలు.. రాతపరీక్ష లేదు
డిగ్రీ, డిప్లొమా మార్కులతో BEMLలో 1346 ఉద్యోగాలు.. రాతపరీక్ష లేదు
మిలాద్-ఉన్-నబీ స్పెషల్.. రైస్ ఖీర్‌ను ఇలా తయారు చేస్తే ఉంటాది..
మిలాద్-ఉన్-నబీ స్పెషల్.. రైస్ ఖీర్‌ను ఇలా తయారు చేస్తే ఉంటాది..