Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BRS Party: బీఆర్‌ఎస్‌లోకి ఊపందుకున్న చేరికలు.. కేసీఆర్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న పలువురు ఏపీ నేతలు.

దేశ రాజకీయాల్లో క్రీయాశీల పాత్ర పోషించాలనుకుంటున్న కేసీఆర్‌ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. భారత రాష్ట్ర సమితి పేరుతో పక్క రాష్ట్రాలకు సైతం విస్తరిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటకలో పోటీకి సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే...

BRS Party: బీఆర్‌ఎస్‌లోకి ఊపందుకున్న చేరికలు.. కేసీఆర్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న పలువురు ఏపీ నేతలు.
Brs Party
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 02, 2023 | 8:04 PM

దేశ రాజకీయాల్లో క్రీయాశీల పాత్ర పోషించాలనుకుంటున్న కేసీఆర్‌ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. భారత రాష్ట్ర సమితి పేరుతో పక్క రాష్ట్రాలకు సైతం విస్తరిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటకలో పోటీకి సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎంటర్‌ అయ్యేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే సోమవారం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు నేతలు ఆబీఆర్‌ఎస్‌లో చేరారు.

ఏపీకి చెందిన తోట చంద్రశేఖర్‌, రావెల కిషోర్ బాబు, పార్థసారథి.. సోమవారం బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ర్యాలీగా హైదరాబాద్‌ బయలు దేరిన ఈ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. కేసీర్‌ నాయకులను స్వయంగాగులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదిల ఉంటే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు మాజీ మంత్రులు, కొన్ని పార్టీలకు చెందిన ముఖ్యనేతలు బీఆర్‌ఎస్‌ వైపు చూస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో నాయకులు కారు ఎక్కడానికి ఆసక్తి చూపిస్తుండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..