AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ దండకారణ్యంలో అలజడి.. మరో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి

అడవిలో అలజడి... దండకారణ్యం ఒక్కసారిగా దద్దరిల్లుతోంది.. తుపాకుల మోతలతో రక్తమోడుతోంది. పచ్చని అటవీప్రాంతం ఎరుపెక్కుతోంది. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌ అటవీ ప్రాంతం వరుస ఎన్‌కౌంటర్లతో రక్తసిక్తమయిన విషయం తెలిసిందే.. తాజాగా.. తెలంగాణలో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.

Telangana: తెలంగాణ దండకారణ్యంలో అలజడి.. మరో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి
Encounter
Shaik Madar Saheb
|

Updated on: Dec 01, 2024 | 10:21 AM

Share

అడవిలో అలజడి… దండకారణ్యం ఒక్కసారిగా దద్దరిల్లుతోంది.. తుపాకుల మోతలతో రక్తమోడుతోంది. పచ్చని అటవీప్రాంతం ఎరుపెక్కుతోంది. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌ అటవీ ప్రాంతం వరుస ఎన్‌కౌంటర్లతో రక్తసిక్తమయిన విషయం తెలిసిందే.. తాజాగా.. తెలంగాణలో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ములుగు జిల్లాలోని చల్పాక సమీప అడవుల్లో మావోయిస్టు – గ్రేహౌంబ్స్ బలగాల  మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.. ఈ భారీ ఎన్ కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ పార్టీ కీలక నేత బద్రు ఎన్కౌంటర్‌లో మృతి చెందినట్లు పేర్కొంటున్నారు. ఆయనతోపాటు మృతుల్లో మరికొందరు కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది..

సరిగ్గా వారం రోజుల క్రితం ఇద్దరు ఆదివాసీలను ఇన్ఫార్మార్ నెపంతో మావోయిస్టులు హత్య చేశారు. వారం తిరగకముందే.. ఏడుగురు మావోయిస్టులను ఎన్కౌంటర్ లో చనిపోయారు.. ఆదివాసీల హత్య అనంతరం అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు భారీ కూంబింగ్ నిర్వహించారు.. ఈ క్రమంలోనే.. చల్పాక సమీప అడవుల్లో పోలీసు జవాన్లకు.. మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసులపైకి కాల్పులు జరపడంతో.. గ్రేహౌండ్స్ బలగాలు తిరిగి కాల్పులు జరిపారు. ఘటనాస్థలంలో రెండు AK-47 రైఫిల్స్‌ స్వాధీనం చేసుకున్నారు.. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇల్లందు-నర్సంపేట ఏరియా కమిటీ హతమైనట్లు తెలిపారు.

14 ఏళ్ల తర్వాత..

డిసెంబర్ 2 (రేపటి నుండి) నుంచి 8వ తేదీ వరకు మావోయిస్టు పార్టీ పి.ఎల్.జి.ఏ వారోత్సవాలు నేపథ్యంలో మావోయిస్టులు కీలక భేటీ నిర్వహించారు.. అయితే. ఈ భేటీపై పక్కా సమాచారంతో పోలీసులు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. 14 సంవత్సరాల తర్వాత వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో అతి పెద్ద ఎన్కౌంటర్ జరగినట్లు అధికారులు తెలిపారు.

చనిపోయినవారి వివరాలు ..

1. కుర్సం మంగు (35) అలియాస్‌ భద్రు, అలియాస్‌ పాపన్న, ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ సెక్రటరీ గా పనిచేస్తున్నాడు.

2. ఎగోలపు మల్లయ్య(43) అలియాస్‌ మధు, అలియాస్‌ కమలాకర్‌, ఏటూరు నాగారం మహదేవ్‌పూర్‌ కమిటీ సెక్రటరీగా ఉన్నాడు.

3. ముస్సకి దేవల్‌ (21) అలియాస్‌ కరుణాకర్‌, ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ సభ్యుడిగా..

4. ముస్సకి జమున (21) ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ సభ్యురాలిగా ఉన్నారు.

వీరితోపాటు.. 5. జైసింగ్‌, 6. కిషోర్‌, 7. కమలేష్‌, మావోయిస్టు పార్టీ మెంబర్లుగా ఉన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..