AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ACE Lab: జూమ్ టెక్నాలజీతో కలిసి ఫోరెన్సిక్ సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన రష్యా ఏసీఈ ల్యాబ్

తెలంగాణలో మరో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. డిజిటల్ ఫోరెన్సిక్, డేటా రికవరీలో దిగ్గజ కంపెనీ అయిన రష్యాకు చెందిన ఏఈసి ల్యాబ్ జూమ్ టెక్నాలజీస్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో అత్యాధునిక ఫోరెన్సిక్ సెంటర్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ACE Lab: జూమ్ టెక్నాలజీతో కలిసి ఫోరెన్సిక్ సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన రష్యా ఏసీఈ ల్యాబ్
Ace Lab In Hyderabad
Balaraju Goud
|

Updated on: Jan 23, 2024 | 9:38 PM

Share

తెలంగాణలో మరో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. డిజిటల్ ఫోరెన్సిక్, డేటా రికవరీలో దిగ్గజ కంపెనీ అయిన రష్యాకు చెందిన ఏఈసి ల్యాబ్ జూమ్ టెక్నాలజీస్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో అత్యాధునిక ఫోరెన్సిక్ సెంటర్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఈ మేరకు మంగళవారం నాడు ఏసీఈ లాబ్ సీఓఓ మ్యాక్స్ పుతివ్ సేవ్, జూమ్ టెక్నాలజీస్ సీఓఓ తోపాటు ఆ సంస్థల ప్రతినిధులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుతో సమావేశమయ్యారు. తాము ఏర్పాటు చేయబోతున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రతిపాదనలపై మంత్రికి వివరించారు. ప్రభుత్వపరంగా కావాల్సిన సహాయ సహకారాల గురించి వారు చర్చించారు.

129 దేశాల్లో తమ సంస్థ కార్యకలాపాలు ఉన్నాయని మంత్రి శ్రీధర్ బాబకు సంస్థ ప్రతినిధులు తెలిపారు. సైబర్ సెక్యూరిటీ రంగంలో ఆయా దేశాల దర్యాప్తు సంస్థలతో కలిసి పనిచేస్తున్న అనుభవం తమకు ఉందని వివరించారు. డేటా లాస్, డిజిటల్ ఇన్వెస్టిగేషన్ సవాళ్లను అధిగమించడానికి భారతీయ వ్యాపారాలు, బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు, దర్యాప్తు సంస్థలకు తాము సహకరిస్తామని స్పష్టం చేశారు. ప్రత్యేకమైన సాంకేతికతతో ఉన్నత స్థాయి నైపుణ్యాలు కలిగిన సాంకేతిక నిపుణులతో ఆయా సంస్థలకు తాము వృత్తిపరమైన శిక్షణ ఇవ్వడంలో నిష్ణార్ధులమని తెలిపారు.

తెలంగాణలో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం పట్ల మంత్రి శ్రీధర్ బాబు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున కావాల్సిన తోడ్పాటును అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు వారికి హామీ ఇచ్చారు. తెలంగాణలో ఆ సంస్థ యూనిట్‌ను ఏర్పాటు చేయడాన్ని మంత్రి స్వాగతించారు.

మంత్రి శ్రీధర్ బాబును కలిసిన టిబెటన్ ప్రతినిధులు

టిబెటన్ పార్లమెంట్ ఇన్ ఎక్సైల్ ప్రతినిధులు మంగళవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. టిబెట్‌కు సార్వభౌమాధికారాన్ని కల్పించడానికి భారత ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి కలిసిన వారిలో మాంక్ గేశే అతుక్ సెతాన్, ఎంపీ సెరింగ్ యంఘ్చెన్, దొండప్ తాషి తదితరులు ఉన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…