AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రాత్రి మూసేసిన షాప్ షట్టర్ తెల్లారేసరికి తెరిచి ఉంది.. లోపలికి వెళ్లి చూడగా

మహబూబాబాద్ జిల్లాలో దొంగలు దడ పుట్టిస్తున్నారు. కేసముద్రం మండల కేంద్రంలో భారీ దోపిడి జరిగింది. మహాలక్ష్మి ట్రేడర్స్‌లో 13 లక్షల రూపాయల నగదు అపహరణ జరిగింది. కౌంటర్‌లోని నగదు మొత్తం మూట కట్టుకొని పారిపోయాడు ఓ దొంగ. ఆ వివరాలు ఇలా..

Telangana: రాత్రి మూసేసిన షాప్ షట్టర్ తెల్లారేసరికి తెరిచి ఉంది.. లోపలికి వెళ్లి చూడగా
Viral Post
Ravi Kiran
|

Updated on: Apr 10, 2025 | 12:41 PM

Share

సమ్మర్‌ సీజన్‌తో దొంగల సీజన్‌ కూడా మొదలైనట్టుంది. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ దొంగలు రెచ్చిపోతూనే ఉన్నారు. తమదైనశైలిలో చోరీలకు పాల్పడుతూనే ఉన్నారు. చెడ్డీగ్యాంగ్‌, ట్యాటూ గ్యాంగ్‌ ఇలా రోజుకో గ్యాంగ్‌ ఊరిమీదపడి దోచుకుంటున్నారు. తాజాగా మహబూబాబాద్‌ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి ఓ దుకాణంలో చొరబడి లక్షల రూపాయల నగదు మూటగట్టుకుపోయారు. ఉదయం షాపు తెరిచి చూసిన యజమాని చోరీ జరిగిందని గ్రహించి లబోదిబోమన్నాడు.

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో భారీ దోపిడీ జరిగింది. గురువారం రాత్రి మహాలక్ష్మి ట్రేడర్స్‌ షాపులో చొరబడిన ఓ దొంగ కౌంటర్‌లోని డెస్క్‌లో ఉన్న 13 లక్షల రూపాయలను చక్కగా టవల్‌లో మూటకట్టుకొని వెళ్లిపోయాడు. కనీసం ఆ దొంగ మాస్క్‌ కూడా పెట్టుకోలేదు. సీసీ కెమెరాలు ఉన్నయేమోనన్న భయం కూడా అతనిలో కనిపించలేదు. షట్టర్‌ తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగ చాలా కూల్‌గా క్యాష్‌ కౌంటర్‌ తాళం పగలకొట్టి అందులో ఉన్న నగదు మొత్తం నీట్‌గా తీసి టేబుల్ పైన పెట్టి అక్కడ సంచి ఏమైనా దొరుకుతుందేమో అని చూసిన అతనికి ఏమీ దొరక్కపోవడంతో తను వెంట తెచ్చుకున్న టవల్లో మూటకట్టి తీసుకొని వెళ్లిపోయాడు. ఇదంతా అక్కడి CC కెమెరాల్లో రికార్డయింది. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. క్లూస్‌ టీం ఆధారాలు సేకరించే పనిలో పడింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ చూడండి 

Follow Us
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!