AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పైకి చూస్తే సాదాసీదా ఎలక్ట్రీషియన్ అనుకునేరు.. మ్యాటర్ తెలిస్తే మైండ్ బ్లాంకే

దేశవ్యాప్తంగా 30 సైబర్ నేరాలకు పాల్పడిన ఒక ఎలక్ట్రీషియన్‌ను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. 30 సైబర్ క్రైమ్ కేసుల్లో అతని పాత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు. యూపీకి చెందిన ఆకాష్ వర్మ విద్యుత్ శాఖలో పనిచేస్తున్నాడు. ఇతడు సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్టు దర్యాప్తులో బయటపడింది.

Hyderabad: పైకి చూస్తే సాదాసీదా ఎలక్ట్రీషియన్ అనుకునేరు.. మ్యాటర్ తెలిస్తే మైండ్ బ్లాంకే
Representative Image 2
Vijay Saatha
| Edited By: Ravi Kiran|

Updated on: Apr 18, 2025 | 5:32 PM

Share

దేశవ్యాప్తంగా 30 సైబర్ నేరాలకు పాల్పడిన ఒక ఎలక్ట్రీషియన్‌ను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. 30 సైబర్ క్రైమ్ కేసుల్లో అతని పాత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు. యూపీకి చెందిన ఆకాష్ వర్మ విద్యుత్ శాఖలో పనిచేస్తున్నాడు. ఇతడు సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్టు దర్యాప్తులో బయటపడింది. తెలంగాణాలోనూ ఇతడిపై నాలుగు కేసులున్నాయి. హైదరాబాద్‌కు చెందిన 36 ఏళ్ల వ్యక్తి ఫిర్యాదుతో మొదలైన దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇతడిని అరెస్ట్ చేసారు. బాధితుడు ఒక WhatsApp గ్రూప్‌లో చేరాడు. ఆ గ్రూప్‌లో అతన్ని సంజయ్‌, అబాకస్‌, ఎమీ అనే ముగ్గురు వ్యక్తులు సంప్రదించారు. అందులో ‘అబాకస్’ అనే వ్యక్తి మార్గదర్శకుడిగా నటిస్తూ బాధితుడిని కొన్ని ప్రత్యేకమైన యాప్‌లను డౌన్‌లోడ్ చేయమని సూచించాడు. తద్వారా పెట్టుబడులు పెట్టాలని ప్రోత్సహించాడు.

మొదట్లో బాధితుడు చిన్న మొత్తాలతో పెట్టుబడి పెట్టాడు. కొన్ని రోజుల్లోనే అతనికి కొన్ని లాభాలు వచ్చినట్లు చూపిస్తూ, దాన్ని నిజమని నమ్మించగలిగారు. అదే సమయంలో అతనికి మరిన్ని పెట్టుబడులు పెట్టమని చెప్పడం జరిగింది. వెరైటీ టాస్క్‌లు ద్వారా అతన్ని మరో గ్రూప్‌కి చేర్చారు. ఆ గ్రూప్‌లో పెట్టుబడులు పెరిగాయి. తర్వాత దశల్లో అతని నుంచి డబ్బు వసూలు చేయడానికి వివిధ రకాల ఫీజులను అడగడం ప్రారంభించారు. డబ్బు డ్రా చేయడానికి బాధితుడు ప్రయత్నించినప్పుడు, మిగతావారి కాల్స్‌కి స్పందన రాలేదు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఈ మోసానికి కీలకమైన ఆకాష్ వర్మను గుర్తించారు. అతను వివిధ వ్యక్తుల నుంచి బ్యాంక్ ఖాతాలు సేకరించి మోసగాళ్లకు అందించేవాడు. అతని సహాయంతోనే బాధితుడి డబ్బులు ఇతర ఖాతాల్లోకి వెళ్లాయి. మొత్తం 1.47 కోట్లు రూపాయలు చెల్లించాడు. ఈ కేసును ఛేదించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.

సోషల్ మీడియా వేదికల ద్వారా మోసగాళ్లు(అనుమానం లేని) వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని చిన్న చిన్న పెట్టుబడులతో మాయ చేస్తారు. తర్వాత వారిని ఇంకెక్కువ పెట్టుబడులు పెట్టించేలా చేస్తారు. చివరికి వారు భారీగా డబ్బు పోగొట్టుకుంటారు. డబ్బు పెద్ద మొత్తానికి చేరుకున్న తర్వాత బాధితులతో సంబంధాలు తెంపేసి మోసగాళ్లు తప్పించుకుంటారు.

ఈ కేసులో బాధితుడు మొదట్లో నమ్మకంతో వ్యవహరించాడు. యాప్‌లను డౌన్‌లోడ్ చేశాడు. చిన్న మొత్తాలలో పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత ఒకదానికొకటి కలిపి, పెద్ద మొత్తాన్ని పెట్టి చివరికి రూ.1.47 కోట్లు కోల్పోయాడు.ఆకాష్ వర్మ బ్యాంక్ ఖాతాలు తెరిపించేలా వివిధ వ్యక్తులను ఒప్పించేవాడు. అందులో కొన్ని ఖాతాలను అతను ప్రత్యక్షంగా మోసాల్లో ఉపయోగించేవాడు. బాధితుడి డబ్బు ఈ ఖాతాల ద్వారా మిగతా మోసగాళ్ల ఖాతాలకు వెళ్లింది.

ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వర్మ, గతంలోనూ ఇలాంటి అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని సహకారంతో పోలీసులు మిగతా మోసగాళ్లను గుర్తించడానికి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఇలాంటి మోసాల పట్ల ప్రజలు మరింతగా జాగ్రత్తపడాలని, పబ్లిక్ అవేర్‌నెస్ పెరిగితే ఇలాంటి మోసాలను ముందే అరికట్టవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఏదైనా సైబర్ మోసానికి గురైతే 1930కు కాల్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.