AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: ఓటమి భయంతోనే బీఆర్‌ఎస్‌, ఎంఐఎం తప్పుడు ప్రచారం.. సీఎం పదవిపై రేవంత్ ఏమన్నారంటే..?

ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీఆర్‌ఎస్‌, ఎంఐఎంలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు రేవంత్‌రెడ్డి. గతంలో తనకు RSS‌ నేపథ్యం ఉన్నా కూడా.. టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల్లో ఆ విధానాలకు అనుగుణంగానే పనిచేశానని చెప్పారు. టీవీ9 పొలిటికల్‌ కాంక్లేవ్‌లో పాల్గొన్న టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల విధానాలు, గ్యారెంటీలు, హామీలతోపాటు..

Shaik Madar Saheb
|

Updated on: Nov 28, 2023 | 9:46 AM

Share

ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీఆర్‌ఎస్‌, ఎంఐఎంలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు రేవంత్‌రెడ్డి. గతంలో తనకు RSS‌ నేపథ్యం ఉన్నా కూడా.. టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల్లో ఆ విధానాలకు అనుగుణంగానే పనిచేశానని చెప్పారు. టీవీ9 పొలిటికల్‌ కాంక్లేవ్‌లో పాల్గొన్న టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల విధానాలు, గ్యారెంటీలు, హామీలతోపాటు.. పొలిటికల్‌ విమర్శలు, సవాళ్లపైనా విస్తృతంగా మాట్లాడారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక 24 గంటల ఉచిత విద్యుత్‌ కొనసాగుతుందని స్పష్టం చేశారు. బీజేపీకి బీఆర్‌ఎస్‌ ఖచ్చితంగా బీ టీమేనని స్పష్టం చేశారు రేవంత్‌రెడ్డి. పలు సందర్భల్లో ఈ విషయం స్పష్టంగా బయటపడిందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి అన్నివర్గాల మద్దతు ఉందన్నారు రేవంత్‌రెడ్డి.

అదే క్రమంలో టీడీపీకి చెందిన వర్గాలు మద్దకు కూడా ఉండవచ్చన్నారు. పార్టీ గెలిచిన తర్వాత సీఎం అభ్యర్ధిపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తాను కట్టుబడి ఉంటానన్నారు రేవంత్‌రెడ్డి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..