AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGSRTC: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రవ్యాప్తంగా 5వేల స్పెషల్ బస్సులు.. ఎప్పటివరకంటే?

రాఖీ పౌర్ణమి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అదిరిపోయే శుభవార్త చెప్పింది. పండగ రద్దీ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5000 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

TGSRTC: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రవ్యాప్తంగా 5వేల స్పెషల్ బస్సులు.. ఎప్పటివరకంటే?
Tgsrtc Rakhi Special Buses
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Aug 27, 2026 | 8:48 PM

Share

రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆగస్టు 27 గురువారం నుంచి ఆగస్టు 31 సోమవారం వరకు ప్రయాణికుల సౌకర్యార్థం 5,000 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆగస్టు 26న మిలాద్-ఉన్-నబీ, ఆగస్టు 28న రాఖీ పౌర్ణమి, ఆగస్టు 30న ఆదివారం సెలవు రావడంతో పండుగకు ముందే ప్రయాణికుల రద్దీ ప్రారంభమవుతుందని మంత్రి తెలిపారు. అలాగే తిరుగు ప్రయాణాల రద్దీ ఆగస్టు 30 ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆగస్టు 31 సోమవారం వరకు కొనసాగే అవకాశం ఉందన్నారు.

గత ఏడాది రాఖీ పౌర్ణమి సందర్భంగా 4,760 ప్రత్యేక బస్సులను నడిపించగా, ఈ ఏడాది ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 240 బస్సులను అదనంగా పెంచి మొత్తం 5,000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. గత ఏడాది ప్రత్యేక బస్సుల ద్వారా సుమారు 3.68 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించగా, అందులో 2.51 కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి కూడా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రద్దీ ఉన్న ప్రాంతాలకు అదనపు బస్సులను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

రాఖీ పౌర్ణమి, తిరుగు ప్రయాణాల రద్దీ నేపథ్యంలో అవసరమైన చోట అదనపు బస్సులను నడపడంతో పాటు ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. మహిళా ప్రయాణికులకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం యథావిధిగా కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. పండుగ రద్దీ సమయంలో ఆర్టీసీ ఉద్యోగులు సమష్టిగా, ఓర్పుతో విధులు నిర్వహిస్తూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

రాఖీ పౌర్ణమి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రతి ఒక్కరూ సురక్షితంగా ప్రయాణించేలా టీజీఎస్‌ఆర్టీసీ అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను వినియోగించుకుని సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వెయ్యి సార్లు ఓడిపోయిన ఒక ముసలాయన 1001వ సారి KFC రూపంలో గెలిచాడు!
వెయ్యి సార్లు ఓడిపోయిన ఒక ముసలాయన 1001వ సారి KFC రూపంలో గెలిచాడు!
చెల్లిని కాపాడేందుకు వెళ్లి అన్న మృతి.. ఒక రోజు తర్వాత..
చెల్లిని కాపాడేందుకు వెళ్లి అన్న మృతి.. ఒక రోజు తర్వాత..
వరంగల్ ఎయిర్‌పోర్టుపై కీలక స్టెప్
వరంగల్ ఎయిర్‌పోర్టుపై కీలక స్టెప్
అఫ్గానిస్థాన్‌పై శతక్కొట్టి కోహ్లీ సరసన నిలిచిన అభిషేక్ శర్మ
అఫ్గానిస్థాన్‌పై శతక్కొట్టి కోహ్లీ సరసన నిలిచిన అభిషేక్ శర్మ
నిమజ్జనం తర్వాత కలశంలోని కొబ్బరికాయను ఏం చేయాలి? ఇలా చేస్తే..
నిమజ్జనం తర్వాత కలశంలోని కొబ్బరికాయను ఏం చేయాలి? ఇలా చేస్తే..
ఇది కదా అసలైన స్కీమ్‌.. ప్రతి 3 నెలలకు మీ ఖాతాలో రూ. 57,400 జమ..!
ఇది కదా అసలైన స్కీమ్‌.. ప్రతి 3 నెలలకు మీ ఖాతాలో రూ. 57,400 జమ..!
ఉచిత గ్యాస్ సిలిండర్ల లబ్దిదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఉచిత గ్యాస్ సిలిండర్ల లబ్దిదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ముంచుకొస్తున్న కొత్త తుఫాన్! తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!
ముంచుకొస్తున్న కొత్త తుఫాన్! తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!
థియేటర్లను షేక్ చేసిన సినిమా.. ఇప్పటికీ తగ్గని డిమాండ్..
థియేటర్లను షేక్ చేసిన సినిమా.. ఇప్పటికీ తగ్గని డిమాండ్..
వినాయకచవితి ప్రసాదం.. కిలో బియ్యంతో టేస్టీ టొమాటో రైస్ ఇలా చేయండి
వినాయకచవితి ప్రసాదం.. కిలో బియ్యంతో టేస్టీ టొమాటో రైస్ ఇలా చేయండి