Telangana: దేవుడా ఉన్నావా.. లారీ ఢీకొనడంతో తల్లిపేగు తెంచుకొని దూరాన పడ్డ గర్భస్థ శిశువు
నిండు గర్భిణిని లారీ ఢీకొట్టడంతో దుర్మరణం చెందింది. లారీ ఆమె పైనుంచి వెళ్లడంతో.... గర్భస్థ శిశువు తల్లిపేగు తెంచుకొని కొంత దూరానపడి పోయింది. ఈ హృదయ విదారక ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.
మెదక్ జిల్లా మనోహరాబాద్లోని జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసకుంది. లారీ ఢీకొట్టడంతో.. నిండు గర్భిణి చనిపోయింది. అంతేకాదు.. ఈ ప్రమాదంలో.. గర్భస్థ శిశువు తల్లి కడుపు నుంచి బయటకు వచ్చి కొంత దూరంలో పడిపోయింది. ఈ దృశ్యాలు అందర్నీ తీవ్రంగా కలిచివేశాయి. బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన పనేటీ 29 ఏళ్ల రేణ ప్రస్తుతం 7 నెలల ప్రెగ్నెంట్. బుధవారం తెలిసిన వ్యక్తితో కలిసి బైక్పై తూప్రాన్ నుంచి మేడ్చల్ వైపు వెళ్తున్నారు. మనోహరాబాద్ వద్ద నేషనల్ హైవేపై వారు ప్రయాణిస్తున్న బైక్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో… లారీ ఆమెపై నుంచి వెళ్లడంతో గర్భస్థ శిశువు కొద్ది దూరంలో పడింది. మహిళ స్పాట్లోనే మృతి చెందింది. నేషనల్ హైవేపై మృత గర్భస్థ శిశువును చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. మల్లుపల్లికి చెందిన పోచయ్య, రేణ దంపతులకు 9, 5 ఏళ్ల వయసున్న ఇద్దరు తనయులు ఉన్నారు. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.