AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరంగల్ వాసులకు గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్ర సర్కార్.. రూ.205 కోట్లు కేటాయింపు..!

ప్రాంతీయ అనుసంధానానికి మార్గం సుగమం చేసిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలంగాణ విమానయాన రంగంలో చారిత్రాత్మక ప్రోత్సాహాన్ని అందించారు. దీంతో వరంగల్ విమానాశ్రయంతో ప్రాంతీయ అభివృద్ధికి మార్గం సుగమమైంది. దీంతో ముమునూరు విమానాశ్రయం పునరుద్ధరణకు సిద్ధమైంది.

వరంగల్ వాసులకు గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్ర సర్కార్.. రూ.205 కోట్లు కేటాయింపు..!
Warangal Mamnoor Airport
Mahatma Kodiyar
| Edited By: |

Updated on: Feb 28, 2025 | 8:13 PM

Share

ప్రాంతీయ అనుసంధానాన్ని మెరుగు పరచడంతో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కృషితో వరంగల్‌లో విమానాశ్రయం పునరుద్ధరణకు సిద్ధమైంది. ప్రాంతీయ అనుసంధానాన్ని బలోపేతం చేసేందుకే మైలురాయిగా నిలువనుంది. ఈ మేరకు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వరంగల్‌లోని ముమునూరు విమానాశ్రయ అభివృద్ధికి పచ్చజెండా ఊపారు. ఈ దశలో జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ద్వారా నిర్వహించనున్నారు.

ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వరంగల్ ఎయిర్ పోర్టుకు లైన్ క్లియర్ చేసింది. ఈ ఆమోదం రాష్ట్రానికి కీలకమైన మైలురాయిని సూచిస్తుంది. ఆర్థిక వృద్ధిని పెంచి, మౌలిక సదుపాయాలను వేగవంతం చేయడంలో ఎన్డీఏ ప్రభుత్వ చిత్తశుద్ధిని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. వరంగల్‌కు ప్రధాన ప్రాంతీయ కేంద్రంగా మారేందుకు అపారమైన అవకాశాలు ఉన్నాయని.. వాణిజ్యం, పర్యాటకం, స్థానిక ఉపాధికి కొత్త అవకాశాలను తీసుకురావడానికి, వేగవంతంగా పనులు చేపట్టేందుకు నిర్ధారించడానికి కట్టుబడి ఉన్నామని తెలియజేశారు.

రూ.205 కోట్లు కేటాయింపు..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2024 నవంబర్ 5న పౌర విమానయాన శాఖ మంత్రికి రాసిన లేఖలో.. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో ఉడాన్ పథకం కింద విమానాశ్రయ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర మద్దతును పునరుద్ఘాటించారు. రాష్ట్రం ఇప్పటికే భూసేకరణ ప్రారంభించడంతో పాటు.. 280.30 ఎకరాల స్థలానికి గాను రూ.205 కోట్లు కేటాయించింది. విమానాశ్రయం పూర్తయితే.. ఈ విమానాశ్రయం ఎయిర్‌బస్ 320, బోయింగ్ 737 కేటగిరీ విమానాలను నిర్వహించగలదని భరోసా ఇచ్చింది.

పనులు వేగవంతంపై..

వరంగల్ విమానాశ్రయం పనులు వేగవంతంపై రాష్ట్ర అభ్యర్థనకు ప్రతిస్పందిస్తూ.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జీఎంఆర్ హైదరాబాద్ విమానాశ్రయం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్ఓసీ) మంజూరు చేయించారు. రాయితీ ఒప్పందంలోని క్లాజ్ 5.2 ప్రకారం 150 కిలోమీటర్ల ప్రత్యేకత పరిమితిని రద్దు చేసినట్లు నిర్ధారించారు. అయితే ఈ సడలింపు కేవలం ముమునూరు విమానాశ్రయానికి మాత్రమే వర్తిస్తుంది. ప్రత్యేక జోన్‌లోని భవిష్యత్తు ప్రాజెక్టులపై ప్రభావం చూపదు.

ప్రణాళిక దశను ప్రారంభించిన ఎయిర్ పోర్ట్ అథారిటీ..

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ ఆదేశాల మేరకు అవసరమైన రెగ్యులేటరీ క్లియరెన్స్‌లను స్వీకరించిన అనంతరం కొనసాగడానికి గ్రీన్ సిగ్నల్‌తో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మౌలిక సదుపాయాల ప్రణాళికను ప్రారంభించింది. వరంగల్ విమానాశ్రయం కార్యాచరణ తెలంగాణ అభివృద్ధిలో కీలకంగా మారుతుందని, ప్రాంతీయ అభివృద్ధి, పర్యాటకం, వాణిజ్య అవకాశాలను పెంపొందించవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు భారత విమానయాన రంగాన్ని అభివృద్ధి చేయడంలో తన అంకితభావాన్ని పునరుద్ఘాటించారు. ఈ విమానాశ్రయం కేవలం మౌలిక సదుపాయాల కంటే.. వరంగల్, పరిసర ప్రాంతాల అభివృద్ధికి మార్గం కానుంది. రామ్మోహన్ నాయుడు చురుకైన నాయకత్వం, రాష్ట్ర – కేంద్ర అధికారుల సమన్వయ ప్రయత్నాలతో, వరంగల్ విమానాశ్రయం భారతదేశ ప్రాంతీయ అనుసంధానంలో కీలకంగా మారనుంది. తెలంగాణకు ఉజ్వలమైన, మరింత అనుసంధానించబడిన భవిష్యత్తును వాగ్దానం చేస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us