AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేపాల్ వరదల్లో గల్లంతైన తెలంగాణకు చెందిన మరో ఎన్నారై ఫ్యామిలీ.. ఆచూకీ కోసం గాలింపు!

కైలాస్ మానస సరోవర్ యాత్రకని వెళ్లిన మరో తెలంగాణ ఫ్యామిలీ నేపాల్ వదరల్లో గల్లంతైంది. సంగారెండ్డి జిల్లాలకు చెందిన ఎన్‌ఆర్ఐ శ్రీధర్ ఫ్యామిలీ ఆగస్టు 26న యాత్ర ముగించుకొని తిరిగి వస్తుండగా గ్యిరోంగ్ ఇమ్మిగ్రేషన్ వద్ద వరదల్లో చిక్కుకున్నట్లు ఈశా ఫౌండేషన్ ధ్రువీకరించింది. అయితే శ్రీధర్‌కు యూకే పౌరసత్వం ఉండడంతో యూకే ప్రభుత్వం కూడా అతని కోసం గాలింపు చర్యల్లో పాలుపంచుకుంటోంది.

నేపాల్ వరదల్లో గల్లంతైన తెలంగాణకు చెందిన మరో ఎన్నారై ఫ్యామిలీ.. ఆచూకీ కోసం గాలింపు!
Uk Nri Family Missing In Nepal Floods
P Shivteja
| Edited By: |

Updated on: Sep 03, 2026 | 3:29 PM

Share

కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన ఓ ఎన్నారై కుటుంబం నేపాల్ వరదల్లో గల్లంతైంది. భార్యాభర్తలతో పాటు వారి కుమారుడు ఆచూకీ లేకుండా పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. 2023లో యూకే నుంచి తిరిగి వచ్చిన ఎన్నారై శ్రీధర్, సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లోని మై ఫెయిల్ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనుగోలు చేసి కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. శ్రీధర్, ఆయన భార్య దీప్తి, కుమారుడు అభినవ్.. ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 13న కైలాస్ మానస సరోవర్ యాత్రకు బయలుదేరారు.

యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణంలో భాగంగా ఆగస్టు 26న గ్యిరోంగ్ ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. అయితే అదే సమయంలో ఆ ప్రాంతాన్ని ఒక్కసారిగా భారీ వరదలు ముంచెత్తాయి. వరదల ఉద్ధృతికి ఇమ్మిగ్రేషన్ కేంద్రం పరిసరాల్లో పలువురు యాత్రికులు గల్లంతయ్యారు. ఈ ఘటనలో శ్రీధర్, ఆయన భార్య దీప్తి, కుమారుడు అభినవ్ కూడా ఉన్నట్టు ఈశా ఫౌండేషన్ ధ్రువీకరించింది. యాత్రికులంతా గ్యిరోంగ్ ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న సమయంలో ఆకస్మిక వరదలు చుట్టుముట్టాయని.. పలువురు కుటుంబాలు ఆచూకీ లేకుండా పోయాయని ఫౌండేషన్ తన ప్రకటనలో వెల్లడించింది.

మరోవైపు..శ్రీధర్ కుటుంబం గల్లంతైన విషయం తెలియడంతో వారి బంధువులు, స్నేహితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గల్లంతైన శ్రీధర్ కుటుంబానికి యూకే పౌరసత్వం ఉన్నట్లు సమాచారం.శ్రీధర్ సోదరుడు కూడా యూకేలోనే నివసిస్తున్నారు. ప్రమాద విషయం తెలియగానే ఆయన తెల్లాపూర్‌కు వచ్చి..అక్కడి నుంచి నేపాల్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. యూకే పౌరసత్వం ఉన్న నేపథ్యంలో.. శ్రీధర్ కుటుంబం కోసం యూకే ప్రభుత్వం కూడా సహాయక చర్యలు, గాలింపు చర్యలను కొనసాగిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,

Follow Us
నేపాల్ వరదల్లో గల్లంతైన తెలంగాణకు చెందిన మరో ఎన్నారై ఫ్యామిలీ
నేపాల్ వరదల్లో గల్లంతైన తెలంగాణకు చెందిన మరో ఎన్నారై ఫ్యామిలీ
96 ఏళ్ల వయసులో స్టేట్‌ ఫస్ట్ ర్యాంక్.. చరిత్ర సృష్టించిన అమ్మమ్మ!
96 ఏళ్ల వయసులో స్టేట్‌ ఫస్ట్ ర్యాంక్.. చరిత్ర సృష్టించిన అమ్మమ్మ!
ఇంత ఈగో పనికారాదమ్మా.. యశ్‌ తల్లికి RGV కౌంటర్
ఇంత ఈగో పనికారాదమ్మా.. యశ్‌ తల్లికి RGV కౌంటర్
200 కోట్ల ఇరుముడి.. ప్రొడ్యూసర్‌కు మామూలు లాభాలు కాదు!
200 కోట్ల ఇరుముడి.. ప్రొడ్యూసర్‌కు మామూలు లాభాలు కాదు!
విజయ్‌ ప్రభుత్వంపై జైలర్ డైలాగ్స్.. క్లారిటీ
విజయ్‌ ప్రభుత్వంపై జైలర్ డైలాగ్స్.. క్లారిటీ
“బాబాయ్ అంటే ఇంతే!” చరణ్ ఎమోషనల్.. బన్నీ క్రేజీ విష్
“బాబాయ్ అంటే ఇంతే!” చరణ్ ఎమోషనల్.. బన్నీ క్రేజీ విష్
కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ ముందస్తు పదవీ విరమణ..
కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ ముందస్తు పదవీ విరమణ..
ఏపీలో రానున్న 3 రోజుల వెదర్ ఎలా ఉండబోతుంది? లేటెస్ట్ రిపోర్ట్ ఇదే
ఏపీలో రానున్న 3 రోజుల వెదర్ ఎలా ఉండబోతుంది? లేటెస్ట్ రిపోర్ట్ ఇదే
కోచ్ కావాలంటూ లింక్డిన్‌లో పాక్ క్రికెట్ బోర్డు ఓపెన్ పోస్ట్!
కోచ్ కావాలంటూ లింక్డిన్‌లో పాక్ క్రికెట్ బోర్డు ఓపెన్ పోస్ట్!
కృష్ణాష్టమి రోజు ఏ పూలతో కన్నయ్యను పూజిస్తే ఎలాంటి శుభ ఫలితాలు..
కృష్ణాష్టమి రోజు ఏ పూలతో కన్నయ్యను పూజిస్తే ఎలాంటి శుభ ఫలితాలు..