కీప్యాడ్ ఫోన్లను ఉపయోగించే 20 కోట్ల మందికి పైగా వినియోగదారుల కోసం ఫోన్ పే "యూపీఐ 123 పే" సేవను ప్రారంభించింది. ఇంటర్నెట్ లేదా స్మార్ట్ ఫోన్ అవసరం లేకుండానే యూపీఐ చెల్లింపులు చేసేందుకు, బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసేందుకు, ట్రాన్సాక్షన్ హిస్టరీ చూసేందుకు ఈ ఎస్ఎంఎస్ ఆధారిత వ్యవస్థ ఉపయోగపడుతుంది. ఇది 2G కనెక్టివిటీ తక్కువ ఉన్న ప్రాంతాల్లో కూడా పని చేస్తుంది.