AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మల్లారెడ్డి యూనివర్సిటీలో విషాదం.. పరీక్ష రాస్తూ తరగతి గదిలోనే గుండెపోటుతో విద్యార్ధి మృతి!

మల్లారెడ్డి యూనివర్సిటీలో విషాదం చోటు చేసుకుంది. ఓ విద్యార్ధి క్లాస్‌ రూంలో పరీక్ష రాస్తూ ఉన్నట్లుండి గుండె పోటుతో స్పృహతప్పి పడిపోయాడు. అనంతరం కాసేపటికే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన గురువారం (ఆగస్టు 8) చోటు చేసుకుంది. దీంతో క్యాంపస్‌లో తీవ్ర కలకలం రేగింది. పేట్ బషీరాబాద్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ విజయవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం..

Hyderabad: మల్లారెడ్డి యూనివర్సిటీలో విషాదం.. పరీక్ష రాస్తూ తరగతి గదిలోనే గుండెపోటుతో విద్యార్ధి మృతి!
Student Dies Of Heart Stroke
Srilakshmi C
|

Updated on: Aug 09, 2024 | 11:38 AM

Share

హైదరాబాద్‌, ఆగస్టు 9: మల్లారెడ్డి యూనివర్సిటీలో విషాదం చోటు చేసుకుంది. ఓ విద్యార్ధి క్లాస్‌ రూంలో పరీక్ష రాస్తూ ఉన్నట్లుండి గుండె పోటుతో స్పృహతప్పి పడిపోయాడు. అనంతరం కాసేపటికే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన గురువారం (ఆగస్టు 8) చోటు చేసుకుంది. దీంతో క్యాంపస్‌లో తీవ్ర కలకలం రేగింది. పేట్ బషీరాబాద్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ విజయవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండకు చెందిన అరుణ్ కుమార్ (19) అనే విద్యార్థి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో పరీక్ష రాస్తుండగా అరుణ్‌ కుమార్ హఠాత్తుగా స్పృహతప్పి పడిపోయాడు. అనంతరం తోటి విద్యార్థులు, వర్సిటీ సిబ్బంది కార్డియోపల్మోనరీ రిససిటేషన్ నిర్వహించి, సూరారంలోని మల్లా రెడ్డి ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతన్ని పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు.

అయితే సకాలంలో అంబులెన్స్‌ రాకపోవడం వల్ల వైద్యం అందించడంలో ఆలస్యం అయిందని, లేకుంటే అరుణ్‌ బతికేవాడని మృతుడి కుటుంబ సభ్యులు, స్నేహితులు యూనివర్సిటీ ఎదుట ధర్నా నిర్వహించారు. యూనివర్సిటీ అధికారులు 25 నిమిషాల్లోనే అరుణ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారని చెబుతున్నారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.

అసలు అరున్‌ ఎందుకు ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయాడు? నిజంగానే కార్డియాక్‌ అరెస్ట్‌ వల్లనే మృతి చెందాడా? మరేదైనా కారణం వల్ల మరణం సంభవించిందా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా ఇటీవల కాలంలో సైలెంట్ హార్ట్ అటాక్ కేసులు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలా సైలెంట్‌గా గుండె ఆగిపోవడాన్ని ‘కోవర్ట్ కిల్లర్’ లాంటిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సైలెంట్‌ హార్ట్‌ ఎటాక్‌ సంభవించినప్పుడు ఛాతిలో తీవ్రమైన నొప్పి, ఒత్తిడిగా అనిపించడం, మెడ, చేతి, అరచేతి నొప్పి రావడం, మగతగా ఉండడం, చెమటలు పట్టడం లాంటి లక్షణాలు ఏవీ కనిపించవట. అందుకే తమకు కలిగే ఆకస్మిక అసౌకర్యం గుండెపోటో కాదో తెలియక ప్రమాదంలో పడుతుంటారని నిపుణులు చెబుతున్నారు. దీంతో చికిత్స మరింత ఆలస్యమై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
వివాహం నుంచి వ్యాపారం వరకు.. శుభ ముహూర్తం వెనుక దాగిన జ్యోతిష్య..
వివాహం నుంచి వ్యాపారం వరకు.. శుభ ముహూర్తం వెనుక దాగిన జ్యోతిష్య..
ఈ వాచ్ స్పృహ తప్పి పడిపోవడానికి 5 నిమిషాల ముందే హెచ్చరిస్తుంది!
ఈ వాచ్ స్పృహ తప్పి పడిపోవడానికి 5 నిమిషాల ముందే హెచ్చరిస్తుంది!
సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. త్రిష తొలి పోస్ట్ వైరల్
సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. త్రిష తొలి పోస్ట్ వైరల్
చికెన్ కర్రీ ఎంత పనిచేసింది.. ఒకరు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు
చికెన్ కర్రీ ఎంత పనిచేసింది.. ఒకరు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు
పరీక్షకు 5 రోజుల ముందే NEET 2026 పేపర్ లీక్.. 13 మంది అరెస్ట్!
పరీక్షకు 5 రోజుల ముందే NEET 2026 పేపర్ లీక్.. 13 మంది అరెస్ట్!
దేశంలో అత్యధిక అప్పులున్న రాష్ట్రాలు..తెలుగు రాష్ట్రాల పరిస్థితి?
దేశంలో అత్యధిక అప్పులున్న రాష్ట్రాలు..తెలుగు రాష్ట్రాల పరిస్థితి?
నల్లగా మారిన ముఖాన్ని క్షణాల్లో మెరిసేలా చేసే సూపర్ చిట్కా
నల్లగా మారిన ముఖాన్ని క్షణాల్లో మెరిసేలా చేసే సూపర్ చిట్కా
కొత్త సీఎంగా విజయ్ సాలరీ ఎంత ఉంటుందో తెలుసా.. ?
కొత్త సీఎంగా విజయ్ సాలరీ ఎంత ఉంటుందో తెలుసా.. ?
బిర్యానీ ఆకుతో డబ్బు, ఆరోగ్యం, అదృష్టం.. ఈ అద్భుతాలు నిజంగా..
బిర్యానీ ఆకుతో డబ్బు, ఆరోగ్యం, అదృష్టం.. ఈ అద్భుతాలు నిజంగా..
ప్రధాని మోడీపై తనికెళ్ల భరణి ఇంట్రెస్టింగ్ పోస్ట్
ప్రధాని మోడీపై తనికెళ్ల భరణి ఇంట్రెస్టింగ్ పోస్ట్