Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాజీ మంత్రి మల్లారెడ్డి నుంచి మా భూములు ఇప్పించండి.. ప్రజావాణిలో మొరపెట్టుకున్న 600 మంది బాధితులు

తెలంగాణలో ప్రజాప్రతి నిధుల భూభాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పలువురు ప్రజాప్రతినిధులు అధికార, అంగ బలాన్ని అడ్డుపెట్టుకుని తమ భూములు లాక్కున్నారంటూ బాధితులు గోడు వెళ్ళబోసుకునేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి తమ భూములు కబ్జా చేశారని ప్రజావాణిలో తమ సమస్య చెప్పుకునేందుకు వచ్చారు.

మాజీ మంత్రి మల్లారెడ్డి నుంచి మా భూములు ఇప్పించండి..  ప్రజావాణిలో మొరపెట్టుకున్న 600 మంది బాధితులు
Mallareddy
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 05, 2024 | 2:49 PM

తెలంగాణలో ప్రజాప్రతి నిధుల భూభాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పలువురు ప్రజాప్రతినిధులు అధికార, అంగ బలాన్ని అడ్డుపెట్టుకుని తమ భూములు లాక్కున్నారంటూ బాధితులు గోడు వెళ్ళబోసుకునేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి తమ భూములు కబ్జా చేశారని ప్రజావాణిలో తమ సమస్య చెప్పుకునేందుకు వచ్చారు. మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లికి చెందిన దాదాపు 600 మంది బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మల్లారెడ్డిపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయంలో మొరపెట్టుకున్నారు.

శ్రీ మల్లికార్జున నగర్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ సొసైటీలో తమ భూములను మల్లాఃరెడ్డి కబ్జా చేశారంటూ ఫ్లెక్సీలతో ప్రజాభవన్ ముందు ఆదోళనకు దిగారు. మల్లారెడ్డిపై చర్యలు తీసు కుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఫేక్‌ డాక్యుమెంట్స్‌తో మల్లారెడ్డి తమ భూములు కబ్జా చేశారని ఆరోపించారు. ఈ మేరకు తన భూమిలోని 360 ప్లాట్లలో 110 ప్లాట్లు మల్లారెడ్డి కబ్జా చేశారని ఒక రైతు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నిస్తే అధికారం అడ్డంపెట్టకుని బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. గతంలోనూ దీనిపై న్యాయ పోరాటం చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. కనీసం ఇప్పుడైనా కాంగ్రెస్ గవర్నమెంట్, రెవిన్యూ అధికారులు తమకు న్యాయం చేయాలని వినతులు ఇస్తున్నారు.

ఇక ప్రజావాణి కార్యక్రమానికి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బాధితులు సైతం ఆందోళనకు దిగారు. ప్రేమ్ సాగర్ రావు తమ నుంచి తమ ప్లాట్లను కాపాడాలంటూ కాప్రా కృష్ణా నగర్ ప్లాట్ ఓనర్స్ నిరసన చేపట్టారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక మొదలు పెట్టిన ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద ఎత్తున వినతి పత్రాలు వస్తుండగా ఇందులో భూవివాదాలే ఎక్కువ సంఖ్యలో ఉండటం గమనార్హం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

వేసవిలో ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక్క మారేడు దళం తింటే చాలు.. లాభాలు
వేసవిలో ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక్క మారేడు దళం తింటే చాలు.. లాభాలు
పవన్ చిన్న కొడుకు హెల్త్ బులెటిన్ విడుదల.
పవన్ చిన్న కొడుకు హెల్త్ బులెటిన్ విడుదల.
జాబిల్లి ఈమె వద్ద వెన్నెలను అప్పుగా తీసుకుంది.. డేజ్లింగ్ మిర్న..
జాబిల్లి ఈమె వద్ద వెన్నెలను అప్పుగా తీసుకుంది.. డేజ్లింగ్ మిర్న..
నల్లగా ఉన్నాయని దూరం పెట్టకండి.. కలోంజితో కలిగే లాభాలు తెలిస్తే..
నల్లగా ఉన్నాయని దూరం పెట్టకండి.. కలోంజితో కలిగే లాభాలు తెలిస్తే..
బాక్సర్ కావాల్సిన అమ్మాయి.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
బాక్సర్ కావాల్సిన అమ్మాయి.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
సెలబ్రిటీ మేక.. ప్రపంచంలోనే ఇలాంటి జీవి మరొకటి లేదట!
సెలబ్రిటీ మేక.. ప్రపంచంలోనే ఇలాంటి జీవి మరొకటి లేదట!
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లు.. ఆ రోజు ఏం జరిగింది ??
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లు.. ఆ రోజు ఏం జరిగింది ??
ఈ జియో ప్లాన్‌లలో ఉచితంగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌..
ఈ జియో ప్లాన్‌లలో ఉచితంగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌..
పూజ గదిలో అగ్గిపెట్టె పెడితే ఏమవుతుందో తెలుసా? ఆ ఒక్క తప్పుతో ..
పూజ గదిలో అగ్గిపెట్టె పెడితే ఏమవుతుందో తెలుసా? ఆ ఒక్క తప్పుతో ..
ఏడుగురు అమ్మాయిలు.. 13 మంది అబ్బాయిలు.. ఫామ్‌ హౌస్‌లో అర్ధరాత్రి
ఏడుగురు అమ్మాయిలు.. 13 మంది అబ్బాయిలు.. ఫామ్‌ హౌస్‌లో అర్ధరాత్రి