BRS Party: లోక్‌సభ ఎన్నికలపై BRS ఫుల్ ఫోకస్.. పవర్ ఫుల్ స్ట్రాటజీతో అభ్యర్థుల ప్రకటన..

అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి కోలుకుని పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. దీనికోసం ఇప్పటినుంచే వ్యూహాలకు పదును పెడుతూ.. ఫుల్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా చేవేళ్ల లోక్‌ సభ స్థానానికి సంబంధించి సమీక్ష నిర్వహించింది. మరోసారి రంజిత్ రెడ్డిను చేవేళ్ల నుంచి పోటీ చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది.

BRS Party: లోక్‌సభ ఎన్నికలపై BRS ఫుల్ ఫోకస్.. పవర్ ఫుల్ స్ట్రాటజీతో అభ్యర్థుల ప్రకటన..
BRS Party
Follow us

|

Updated on: Dec 26, 2023 | 4:54 PM

అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి కోలుకుని పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. దీనికోసం ఇప్పటినుంచే వ్యూహాలకు పదును పెడుతూ.. ఫుల్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా చేవేళ్ల లోక్‌ సభ స్థానానికి సంబంధించి సమీక్ష నిర్వహించింది. మరోసారి రంజిత్ రెడ్డిను చేవేళ్ల నుంచి పోటీ చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. జనవరి 3 నుంచి తెలంగాణ భవన్‌లో లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతపై వరుస సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నుంచి తీవ్ర పోటీ ఉంటుందని.. కార్యకర్తలంతా ప్రణాళికాబద్ధంగా పని చేయాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలకు సూచించారు.

చేవెళ్ల పార్లమెంట్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరాలంటూ ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టమైన సూచనలు చేశారు. బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పని చేయాలని ఆయన సూచించారు. అందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని కేటీఆర్ స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో కేటీఆర్ నేతృత్వంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశం జరగగా.. పలు స్పష్టమైన సూచనలు చేశారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు మన బీఆర్ఎస్ పార్టీ సుమారు 98,000 ఓట్ల లీడ్ ఉందని గుర్తు చేశారు. అదేస్థాయిలో.. అంతే స్ఫూర్తితో రానున్న పార్లమెంట్​ ఎన్నికల్లో పనిచేయాలని చేవెళ్ల ప్రజాప్రతినిధులకు కీలక నాయకులకు కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల్లో సమన్వయం చేసుకుంటూ పని చేయాలని కోరారు. కాగా, ఈ భేటీకి మాజీ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, పట్నం మహేందర్రెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, అరెకపూడి గాంధీ, మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేష్ రెడ్డి, మెతుకు ఆనంద్ తదితరులు హాజరయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ