AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kishan Reddy: తెలంగాణకు కేంద్రం అందించిన మరో వరం.. పౌర విమానయాన పరిశోధనా కేంద్రం: కిషన్‌ రెడ్డి

ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 4,5 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రధాని టూర్‌కు సంబంధించిన షెడ్యూల్‌ సైతం ఖరారైంది. ఈ పర్యటనలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్‌ జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసే వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. రాష్ట్రంలో పలు...

Kishan Reddy: తెలంగాణకు కేంద్రం అందించిన మరో వరం.. పౌర విమానయాన పరిశోధనా కేంద్రం: కిషన్‌ రెడ్డి
Kishan Reddy
Narender Vaitla
|

Updated on: Feb 29, 2024 | 8:16 PM

Share

హైదరాబాద్‌లో పౌర విమానయాన పరిశోధనా కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బేగంపేట విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ సంస్థను ప్రారంభించనున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 4,5 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రధాని టూర్‌కు సంబంధించిన షెడ్యూల్‌ సైతం ఖరారైంది. ఈ పర్యటనలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్‌ జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసే వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. వీటిలో ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్‌ కూడా ఒకటి. మార్చ 5వ తేదీన మోదీ ఈ సెంటర్‌ను ప్రారంభిస్తారు.

ఈ విషయమై తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడారు. తెలంగాణకు నరేంద్ర మోదీ ప్రభుత్వం అందిస్తోన్న మరో బహుమతి ఈ సెంటర్‌ అని కిషన్‌ రెడ్డి అన్నారు. సివిల్‌ ఏవియేషన్‌ రంగంలో సరికొత్త టెక్నాలజీకి ఈ సెంటర్‌ నాంది పలుకుతుందని కిషన్‌ రెడ్డి అన్నారు. భారతదేశంలో ‘గ్రిహ-5’ ప్రమాణాలతో నిర్మించిన తొలి సెంటర్‌ ఇదేనన్నారు.

ఈ సివిల్‌ ఏవియేషన్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ సెంటర్‌ ద్వారా ఏయిర్‌ నావిగేషన్‌ సర్వీసెస్‌కు అవసరమైన రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సదుపాయాలను అందిస్తారు. ఈ సెంటర్‌లో నెట్‌వర్క ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ సెంటర్‌, డేటా మేనేజ్‌మెంట్‌ సెంటర్‌, సైబర్‌ సెక్యూరిటీ అండ్ థ్రెట్ అనలసీస్‌ ల్యాబ్స్‌ వంటి సదుపాయాలు ఉండనున్నాయి. తెలంగాణలో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసినందుకు నరేంద్ర మోదీకి కిషన్‌ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు