AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KA Paul: సీఎం కేసీఆర్ పుట్టినరోజునే ఎందుకు సెక్రటేరియట్ ఓపెన్ చేయాలి.. సీబీఐకి కేఏ పాల్ లేఖ..

కొత్త సచివాలయంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ.. సీబీఐకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ లేఖ రాశారు. సచివాలయం లోపలికి మీడియాను అనుమతించకపోవడంపై అనుమానాలు....

KA Paul: సీఎం కేసీఆర్ పుట్టినరోజునే ఎందుకు సెక్రటేరియట్ ఓపెన్ చేయాలి.. సీబీఐకి కేఏ పాల్ లేఖ..
Ka Paul
Ganesh Mudavath
|

Updated on: Feb 05, 2023 | 9:38 PM

Share

కొత్త సచివాలయంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ.. సీబీఐకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ లేఖ రాశారు. సచివాలయం లోపలికి మీడియాను అనుమతించకపోవడంపై అనుమానాలు ఉన్నాయన్నారు. సెక్రటేరియట్ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో చెలరేగిన మంటలు.. ఆరో అంతస్తు వరకు వ్యాపించాయని చెప్పారు. డోమ్ ల నుంచి వెలువడిన పొగ చూస్తుంటే.. ప్రమాదం భారీ స్థాయిలో జరిగిందని తెలుస్తోందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజునే ఎందుకు సెక్రటేరియట్ ఓపెన్ చేయాలన్న కేఏ పాల్… ప్రజాధనంతో కట్టిన సచివాలయాన్ని అంబేడ్కర్ జయంతి రోజునే ఓపెన్ చేయాలని డిమండ్ చేశారు. కేసీఆర్ కు మూఢనమ్మకాలు ఎక్కువని ఆక్షేపించారు. సెక్రటేరియట్ లో ఏం జరుగుతోందో చెప్పాలని నిలదీశారు.

బంగారు తెలంగాణ అని చెప్పి రాష్ట్రాన్ని దివాళా తీయించారు. శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారిని కిడ్నాప్ చేశారు. ప్రజాశాంతి పార్టీలో చేరినందుకు ఆయనను కిడ్నాప్ చేశారు. సచివాలయం బిల్డింగ్ లో అగ్నిప్రమాదం జరిగి ఐదు రోజులు అయింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో మీడియాను ఎందుకు అనుమతి ఇవ్వలేదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎందుకు ఈ విషయంపై ప్రశ్నించడం లేదు.

       – కేఏ పాల్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు

ఇవి కూడా చదవండి

కాగా.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన సచివాలయంలో ఇటీవల భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది 11 అగ్ని మాపక యంత్రాలతో రంగంలోకి దిగి మంటలు అదుపు చేశాయి. ఫైర్ సేఫ్టీ అన్ని రకాల పనులను చెక్ చేసుకుంటూ ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
రోజూ టన్నుల కొద్దీ జీడిపప్పు ఎలా ప్రాసెస్ చేస్తారో తెలిస్తే
రోజూ టన్నుల కొద్దీ జీడిపప్పు ఎలా ప్రాసెస్ చేస్తారో తెలిస్తే
ఐపీఎల్ 2025లో బ్యాటర్ల చేతిలో బలైపోయిన టాప్-5 బౌలర్లు వీళ్లే
ఐపీఎల్ 2025లో బ్యాటర్ల చేతిలో బలైపోయిన టాప్-5 బౌలర్లు వీళ్లే
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
బంగారం ధరల్లో భారీ క్రాష్.. త్వరలో రూ.1.20 లక్షలకు డౌన్..!
బంగారం ధరల్లో భారీ క్రాష్.. త్వరలో రూ.1.20 లక్షలకు డౌన్..!
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..