AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malla Reddy: ఆ మంత్రి ఆస్తులపై 6 గంటలుగా ఐటీ సోదాలు.. బంధువుల ఇళ్లనూ వదలని అధికారులు..

హైదరాబాద్‌లో మంత్రి మల్లారెడ్డి నివాసంలో ఐటీ శాఖ సోదాలు కొనసాగుతున్నాయి. మల్లారెడ్డితోపాటు కుమారుడు, అల్లుడి ఇళ్లలో తనిఖీలు కొనసాతున్నాయి. బోయినపల్లిలోని మల్లారెడ్డి నివాసం..

Malla Reddy: ఆ మంత్రి ఆస్తులపై 6 గంటలుగా ఐటీ సోదాలు.. బంధువుల ఇళ్లనూ వదలని అధికారులు..
Minister Malla Reddy House
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Nov 22, 2022 | 12:54 PM

హైదరాబాద్‌లో మంత్రి మల్లారెడ్డి నివాసంలో ఐటీ శాఖ సోదాలు కొనసాగుతున్నాయి. మల్లారెడ్డితోపాటు కుమారుడు, అల్లుడి ఇళ్లలో తనిఖీలు కొనసాతున్నాయి. బోయినపల్లిలోని మల్లారెడ్డి నివాసం, కొంపల్లిలో నివాసముంటున్న ఆయన కుమారుడు ఇంట్లో సోదాలు జరుపుతున్నారు. తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో 50 బృందాలు ఈ తనిఖీలను చేపట్టాయి. పన్ను ఎగవేతకు సంబంధించి పూర్తి స్థాయిలో తనిఖీలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. బాలానగర్ రాజుకాలనీలో క్రాంతి బ్యాంక్ చైర్మన్ రాజేశ్వర్ రావు ఇంట్లో ఐటి శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. క్రాంతి బ్యాంక్‌లో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ లావాదేవీలను ఐటీ అధికారులు గుర్తించారు.

సీఆర్‌పీఎఫ్ బలగాల భద్రతతో మల్లారెడ్డి ఇళ్లు, ఆఫీసుతో పాటు ఆయనకు చెందిన మల్లారెడ్డి విద్యాసంస్థల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కండ్లకోయ సీఎంఆర్ కాలేజీలో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పన్ను ఎగవేతకు సంబంధించి ఆరాతీస్తున్న క్రమంలో అధికారుల నుంచి మల్లారెడ్డి సోదరుడు గోపాల్‌రెడ్డి పరారయ్యేందుకు యత్నించారు.

మల్లారెడ్డి ఆస్తుల వివరాలు..

మంత్రి మల్లారెడ్డికి మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లాలోని పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయని అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఒక యూనివర్శిటీ సహా మొత్తం 38 ఇంజనీరింగ్ కాలేజీలు మల్లారెడ్డికి ఉన్నాయి. మొత్తం 6కు పైగా స్కూళ్లు, పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్, వందల ఎకరాల భూములు, ఇంకా దేవరాంజల్, షామీర్ పేట్, జవహర్ నగర్‌, మేడ్చల్, ఘట్కేసర్, కీసరలో భారీగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

కాగా, మల్కాజిగిరి  ఎంపీ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి గెల్చిన మల్లారెడ్డి.. తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. పదో తరగతి వరకే చదువుకున్న ఆయన కొంతకాలం పాల వ్యాపారం చేశారు. కానీ ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు పెట్టారు. మేడ్చల్.. మల్కాజిగిరి ప్రాంతాల్లో ఆయనకు మించిన ధనవంతుడు లేడని స్థానికంగానే ఉన్న ప్రచారం. ఇప్పుడు ఐటీ దాడులపై ఆయన ఎలా స్పందిస్తారో.. ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..