AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంధువుల ఇంట్లో వివాహానికి అమెరికా నుంచి వచ్చి.. తిరిగి వెళ్తూ విగత జీవిగా మారిన యువతి..

ఆ కుటుంబం అమెరికాలో స్థిరపడింది. ఓ వివాహం కోసమని వాళ్ల కూతురు ఇండియాకి వచ్చింది. కాసేపట్లో అమెరికా వెళ్లాల్సి ఉండగా ఆమెను మృత్యువు వెంటాడింది.

బంధువుల ఇంట్లో వివాహానికి అమెరికా నుంచి వచ్చి.. తిరిగి వెళ్తూ విగత జీవిగా మారిన యువతి..
Accident
Aravind B
|

Updated on: Mar 19, 2023 | 3:39 PM

Share

ఆ కుటుంబం అమెరికాలో స్థిరపడింది. ఓ వివాహం కోసమని వాళ్ల కూతురు ఇండియాకి వచ్చింది. కాసేపట్లో అమెరికా వెళ్లాల్సి ఉండగా ఆమెను మృత్యువు వెంటాడింది. రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించింది. ఈ ఘటన నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చీకటిగూడెం గ్రామ శివారులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడకు చెందిన కరణం పద్మానాయుడు కుటుంబం కొన్నేళ్ల క్రితమే అమెరికాలో స్థిరపడింది. ఇటీవల వారి బంధువుల కుటుంబంలో ఇటీవలే వివాహం జరిగింది. అయితే ఈ పెళ్లికి పద్మనాయుడు కుమార్తె ప్రీతి వచ్చింది. పెళ్లి వేడుకలు అంతా అయిపోయాక తిరిగి ఆమె అమెరికా వెళ్లాల్సి ఉంది. శనివారం రాత్రి ఆమెకు హైదరాబాద్ లో ప్లైట్ ఉంది. అయితే సమీప బంధువులందరూ ఆమెను ఎయిర్ పోర్టులో దిగబెట్టేందుకు కారులో బయలుదేరారు.

విజయవాడ నుంచి వాళ్ల కారు నల్గొండ జిల్లాకు చేరుకుంది. అక్కడి నుండి హైదరాబాద్ కు వస్తుండగా చీకటిగూడెం శివారుకు రాగానే సూర్యాపేట నుంచి హైదరాబాద్‌ వెళుతున్న గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు జాతీయ రహదారిపై ఏకంగా మూడు పల్టీలు కొట్టింది. తలకు తీవ్ర గాయాలైన కరణం ప్రీతి(21) అక్కడికక్కడే మృతి చెందింది. కారు నడుపుతున్న దొప్పలపూడి శ్రేయాస్‌, అందులో ప్రయాణిస్తున్న చేకూరి సరిత, దివి విశ్వవిఖ్యాత్‌, దివి పద్మావతిలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రీతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం, క్షతగాత్రులను చికిత్స కోసం నకిరేకల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని కేతేపల్లి ఏఎస్సై ఎన్‌.శ్రీనివాస్‌ వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
ఏపీలో పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమలు
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
సైఫ్ బాధ్యతారాహిత్యంపై దర్శకుడు రాహుల్ రవాలి ఫైర్!
సైఫ్ బాధ్యతారాహిత్యంపై దర్శకుడు రాహుల్ రవాలి ఫైర్!