AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పచ్చని సంసారంలో చిచ్చుపెట్టిన యూట్యూబ్ జ్యోతిష్యం.. భర్త దక్కడేమోనని భార్య ఏం చేసిందంటే..?

జ్యోతిష్యం ఓ పచ్చిన కాపురంలో చిచ్చు చెప్పింది. య్యూట్యూబ్‌లో వచ్చే జ్యోతిష్యాన్ని నమ్మి ఓ గృహిణి ప్రాణాలు తీసుకుంది. నూరేళ్లు భర్తతో కలిసి నడవాల్సిన భార్య అర్థంతరంగా తనువు చాలించింది.. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. అల్వాల్ ఇంద్రనగర్‌లో నివాసం ఉంటుంది భవిత.. ఈమె భర్త రామకృష్ణ ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి..

Hyderabad: పచ్చని సంసారంలో చిచ్చుపెట్టిన యూట్యూబ్ జ్యోతిష్యం.. భర్త దక్కడేమోనని భార్య ఏం చేసిందంటే..?
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Jan 09, 2024 | 4:33 PM

Share

జ్యోతిష్యం ఓ పచ్చిన కాపురంలో చిచ్చు చెప్పింది. య్యూట్యూబ్‌లో వచ్చే జ్యోతిష్యాన్ని నమ్మి ఓ గృహిణి ప్రాణాలు తీసుకుంది. నూరేళ్లు భర్తతో కలిసి నడవాల్సిన భార్య అర్థంతరంగా తనువు చాలించింది.. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. అల్వాల్ ఇంద్రనగర్‌లో నివాసం ఉంటుంది భవిత.. ఈమె భర్త రామకృష్ణ ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి.. వీరికి మూడు సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు..అయితే భవితకు జ్యోతిష్యం మీద నమ్మకం ఎక్కువ..జ్యోతిష్యం ఎలా చెప్తే అలా జరుగుతుందని నమ్మకం..ఇలాగే య్యూట్యూబ్‌లో వచ్చే జ్యోతిష్యంలో భర్తతో విడిపోతావని ఉండటంతో అదే నిజమని నమ్మి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ అంబర్‌పేటకు చెందిన బబిత (28)కు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రామకృష్ణతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. కానాజీగూడ ఇందిరానగర్‌లో కాపురం ఉంటున్నారు. ఈ దంపతులకు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే బబిత జ్యోతిష్యాన్ని విపరీతంగా నమ్ముతుంది. జ్యోతిష్యం ఎలా చెప్తే అలా జరుగుతుందని నమ్మకం.. ఈ క్రమంలో యూట్యూబ్‌లో చెప్పిన ఓ జ్యోతిష్యం విన్నది. అందులో చెప్పినట్టుగా తాము విడిపోతామని బలంగా నమ్మింది. ఇదే విషయాన్ని భర్తతో తరచూ చెప్తుండగా.. అతను ఆమెతో అదేం లేదంటూ వాదించేవాడు.. ఈ క్రమంలో సోమవారం ఉదయం రాము విధులకు వెళ్లగా, కుమారుడు అంగన్‌వాడీకి వెళ్లాడు. మధ్యాహ్నం వేళ.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మధ్యాహ్నం వచ్చిన చిన్నారి.. తల్లిని చూసి కింది పోర్షన్‌లో ఉండే బాబాయికి చెప్పాడు.. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే బబిత మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

ఈ విషయం తెలిసిన బబిత తల్లిదండ్రులు రాముపై దాడి చేశారు. అదనపు కట్నం కోసం వేధించడం వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. అయితే, జ్యోతిష్యాన్ని నమ్మే ఆమె ఆత్మహత్య చేసుకుందని, దానిని నమ్మవద్దని తాను పదేపదే చెప్పేవాడినని రాము పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..