పైకేమో చూస్తే అదొక టిఫిన్ సెంటర్.. కానీ లోపల జరిగేది తెలిస్తే మైండ్ బ్లాంక్.!
కర్ర ఇచ్చి పళ్లు రాలగొట్టించుకోవడం అంటే ఇదేనేమో.. బుద్దిగా పని చేసుకుంటాడని ఉపాధి కలిపించిన పోలీసులకే ఓ దొంగ తన దొంగ బుద్ధి చూపించాడు. 200 పైగా చోరీలు చేసిన నిందితుడికి ఉపాధి కల్పిస్తే మారుతాడని భావించారు పోలీసులు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ ముందే ఓ టిఫిన్ సెంటర్ను పెట్టించారు.
కర్ర ఇచ్చి పళ్లు రాలగొట్టించుకోవడం అంటే ఇదేనేమో.. బుద్దిగా పని చేసుకుంటాడని ఉపాధి కలిపించిన పోలీసులకే ఓ దొంగ తన దొంగ బుద్ధి చూపించాడు. 200 పైగా చోరీలు చేసిన నిందితుడికి ఉపాధి కల్పిస్తే మారుతాడని భావించారు పోలీసులు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ ముందే ఓ టిఫిన్ సెంటర్ను పెట్టించారు. 2 ఏళ్లు టిఫిన్ సెంటర్ను నడిపించిన సదరు దొంగ తన దొంగ బుద్ధి మార్చుకోక పోలీసుల కండ్లు కప్పి మళ్లీ దొంగతనాలు మొదలు పెట్టాడు. చోరీలు చేశాక పోలీసులకు దొరకుండా ఏమి చెయ్యాలో సినిమాలు చూసి నేర్చుకున్నాడు. చివరికి పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు.
ఈ దొంగ ముచ్చట చూస్తుంటే కలకాలపు ఓ దొంగ ఒక రోజు దొరుకును అనే సామెత గుర్తు వస్తుంది. వరుసగా దొంగతనాలు చేస్తూ 2021లో పట్టుబడిన 50 ఏళ్ల వెంకట రమణను పోలీసులు మార్చాలనుకున్నారు. ఉపాధి కలిపిస్తే మారతాడని భావించారు. అతడితో ఓ టిఫిన్ సెంటర్ను పెట్టించారు. బాగానే 2 ఏళ్ల పాటు నడిపించాడు. ఆ తరువాత పాత జ్ఞాపకాలు గుర్తు వచ్చాయో.. ఏమో తిరిగి తన దొంగ వృత్తిని పోలీసుల కళ్లు కప్పి మొదలు పెట్టాడు. రాచకొండ కమిషనరేట్ ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడ్డాడు. అటు పోలీసులకు.. ఇటు జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని సీసీ కెమెరాలు ఉంటే దివ్యాంగుడిలా నటించేవాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేయగా.. దివ్యాంగుడిలా నడిచే వ్యక్తే దొంగగా గుర్తించారు. నిందితుడు వద్ద నుండి 21 తులాల బంగారం, కిలో వెండి, 1,50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. వెంకట రమణపై మిర్యాలగూడ, కోదాడ, సిద్దిపేట, ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.