AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: ఆర్టీసీ బస్సులపై బిగ్‌బాస్‌ ఫ్యాన్స్‌ దాడి.. స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చిన సజ్జనార్‌

పల్లవి ప్రశాంత్‌, అమర్‌దీప్‌ అభిమానులు పరస్పరం కొట్టుకోవడమే కాదు... అటువైపు వెళ్లే వాహనాలపైనా దాడికి దిగారు. బిగ్‌బాస్‌ ఫ్యాన్స్‌ దాడిలో ఆర్టీసీ బస్సులతోపాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. వీళ్లను కంట్రోల్‌ చేయడానికి పెద్దఎత్తున పోలీసుల్ని రంగంలోకి దింపాల్సి వచ్చింది. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదుతో పల్లవి ప్రశాంత్‌, అమర్‌దీప్‌ ఫ్యాన్స్‌పై కేసులు నమోదు చేశారు జూబ్లీహిల్స్‌ పోలీసులు.

Bigg Boss 7 Telugu: ఆర్టీసీ బస్సులపై బిగ్‌బాస్‌ ఫ్యాన్స్‌ దాడి.. స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చిన సజ్జనార్‌
TSRTC MD VC Sajjanar
Follow us
Basha Shek

|

Updated on: Dec 18, 2023 | 2:45 PM

బిగ్‌బాస్‌ హౌస్‌లోనే కాదు.. బిగ్‌బాస్‌ బయట కూడా రచ్చరచ్చ జరిగింది. బిగ్‌బాస్‌ హౌస్‌లో కంటెస్టెంట్లు కొట్టుకుంటే… హౌస్‌ బయట వాళ్ల ఫ్యాన్స్‌ అంతకంటే ఎక్కువ హంగామా, హడావిడి చేశారు. తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ సెవెన్‌ విజేతను ప్రకటించగానే నడిరోడ్డుపై కొట్టుకున్నారు పల్లవి ప్రశాంత్‌, అమర్‌దీప్‌ ఫ్యాన్స్‌. అన్నపూర్ణ స్టూడియోస్‌ దగ్గర ఈ రచ్చ జరిగింది. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ బూతులతో రెచ్చిపోయాయి ఇరువర్గాలు. పల్లవి ప్రశాంత్‌, అమర్‌దీప్‌ అభిమానులు పరస్పరం కొట్టుకోవడమే కాదు… అటువైపు వెళ్లే వాహనాలపైనా దాడికి దిగారు. బిగ్‌బాస్‌ ఫ్యాన్స్‌ దాడిలో ఆర్టీసీ బస్సులతోపాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. వీళ్లను కంట్రోల్‌ చేయడానికి పెద్దఎత్తున పోలీసుల్ని రంగంలోకి దింపాల్సి వచ్చింది. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదుతో పల్లవి ప్రశాంత్‌, అమర్‌దీప్‌ ఫ్యాన్స్‌పై కేసులు నమోదు చేశారు జూబ్లీహిల్స్‌ పోలీసులు. మరోవైపు ఆర్టీసీ బస్సులపై బిగ్‌ బాస్‌ ఫ్యాన్స్‌ దాడిపై టీఎస్‌ ఆర్టసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానుల దాడిలో ధ్వంసమైన బస్సుల ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఆయన దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బిగ్ బాస్-7 గ్రాండ్‌ ఫినాలే సందర్భంగా హైదదాబాద్‌ లోని కృష్ణానగర్‌ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి టీఎస్‌ ఆర్టసీకి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేసి.. దర్యాప్తు చేస్తున్నారు. అభిమానం పేరుతో చేసే పిచ్చి చెష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదు. ప్రజలను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్టే. ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’ అని అభిమానులకు హితవు పలికారు ఎండీ సజ్జనార్‌.

ఇవి కూడా చదవండి

ఆర్టీసీ బస్సులపై దాడులుచేస్తే సమాజంపై దాడి చేసినట్టే

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.