AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఉమ్రా యాత్రకు వెళ్లి వచ్చారు.. ఇంట్లో అడుగు పెట్టగానే ఊహించని సీన్..

ఉమ్రా యాత్రకు వెళ్లిన కుటుంబం ఇంట్లో ఎవరూ లేరనే సమాచారాన్ని ఆసరాగా చేసుకున్న సొంత బంధువులే చోరీకి పాల్పడ్డారు. హబీబ్‌నగర్‌లో జరిగిన ఈ ఘటనలో రూ.16 లక్షల నగదు, బంగారు ఆభరణాలు సహా మొత్తం రూ.29 లక్షల విలువైన సొత్తును అపహరించారు. సీసీటీవీ ఆధారాలతో కేసును ఛేదించిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి నగదు, బంగారం, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad: ఉమ్రా యాత్రకు వెళ్లి వచ్చారు.. ఇంట్లో అడుగు పెట్టగానే ఊహించని సీన్..
Money
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Jul 05, 2026 | 8:27 AM

Share

పవిత్రమైన ఉమ్రా యాత్రకు వెళ్లిన ఓ కుటుంబాన్ని వారి సొంత బంధువులే నమ్మకద్రోహం చేశారు. ఇంట్లో ఎవరూ లేరనే సమాచారాన్ని ఆసరాగా చేసుకుని పక్కా ప్లాన్‌తో చోరీకి పాల్పడ్డారు. అయితే సీసీటీవీ సాయంతో పోలీసులు కేసును ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.29 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాంపల్లి హబీబ్ నగర్‍లో షేక్ అక్బర్ మొహియూద్ధీన్ తన కుటుంబంతో కలిసి జూన్ 23న పవిత్రమైన ఉమ్రా యాత్రకు వెళ్లారు. ఈ విషయం తెలిసిన బాధితుడి బంధువులైన మహ్మద్ యూనుస్, షేక్ రమీజ్ మొహియుద్దీన్ ముందుగానే చోరీకి ప్రణాళిక రచించారు. తమకు పరిచయమున్న సందీప్‌ అనే స్నేహితుడిని కూడా ఇందులో భాగస్వామిని చేశారు.

జూలై 1న ముగ్గురు కలిసి ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న రూ.16 లక్షల నగదు, సుమారు 13.5 తులాల బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను అపహరించి పరారయ్యారు. ఫిర్యాదు అందుకున్న హబీబ్‌నగర్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీతో పాటు కచ్చితమైన ఆధారాలను సేకరించి దర్యాప్తు చేపట్టారు. జూలై 3న భోయిగూడ కమాన్ వద్ద వాహన తనిఖీల సమయంలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి విచారణలో లభించిన సమాచారం ఆధారంగా మరో నిందితుడిని కూడా అరెస్టు చేశారు.

వీడియో చూడండి..

నిందితుల వద్ద నుంచి 134.44 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.12.50 లక్షల నగదు, రూ.1.40 లక్షల విలువైన రాడో వాచ్, వెండి పట్టీలు, చోరీకి ఉపయోగించిన హోండా యాక్టివాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న ఆస్తి విలువ సుమారు రూ.29 లక్షలుగా పోలీసులు వెల్లడించారు.ముగ్గురు నిందితులను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి రిమాండ్ విధించింది. ఈ కేసులో ఇంటి పరిస్థితులు, కుటుంబం బయటకు వెళ్లిన విషయం ముందే తెలిసిన బంధువులే నిందితులుగా తేలడం కలకలం రేపుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇంటి రహస్యం తెలిసిన వారే దొంగలు.. అసలు నిందితులు ఎవరో తెలుసా?
ఇంటి రహస్యం తెలిసిన వారే దొంగలు.. అసలు నిందితులు ఎవరో తెలుసా?
నెయ్యి + తమలపాకు కాంబినేషన్.. ఆ సమస్యలకు చెక్‌పెట్టే రామబాణం..!
నెయ్యి + తమలపాకు కాంబినేషన్.. ఆ సమస్యలకు చెక్‌పెట్టే రామబాణం..!
ఏలూరు జిల్లాలో విషాదం.. ట్రైన్‌ ఢీకొని నలుగురు మృతి
ఏలూరు జిల్లాలో విషాదం.. ట్రైన్‌ ఢీకొని నలుగురు మృతి
బౌండరీ లైన్‌లో కళ్లు చెదిరే ఫీల్డింగ్.. గాల్లోకి లేచి ఒంటిచేత్తో
బౌండరీ లైన్‌లో కళ్లు చెదిరే ఫీల్డింగ్.. గాల్లోకి లేచి ఒంటిచేత్తో
బిగ్ బాస్ వల్ల చాలా కోల్పోయా:
బిగ్ బాస్ వల్ల చాలా కోల్పోయా:
రోగాలన్నింటికీ చెక్ పెట్టే అద్భుత ఫలం.. కనిపిస్తే వదలకండి..లాభాలు
రోగాలన్నింటికీ చెక్ పెట్టే అద్భుత ఫలం.. కనిపిస్తే వదలకండి..లాభాలు
వాడిని క్షమించను.. నమ్మి ఛాన్స్ ఇస్తే నట్టేట ముంచాడు
వాడిని క్షమించను.. నమ్మి ఛాన్స్ ఇస్తే నట్టేట ముంచాడు
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయి?
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయి?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
E20 ఇంధనంతో మైలేజ్ తగ్గుతుందా? ఇంజిన్‌పై ప్రభావం ఉంటుందా?
E20 ఇంధనంతో మైలేజ్ తగ్గుతుందా? ఇంజిన్‌పై ప్రభావం ఉంటుందా?