AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: గ్రూప్ 1 పరీక్ష రాసి ఇంటికి వెళ్తుండగా విషాదం.. మహిళా అభ్యర్ధి మృతి

ఆదివారం జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష రాసి ఇంటికి తిరిగి వెళ్లుండగా ఓ అభ్యర్ధి మార్గం మధ్యలో కన్నుమూసింది. పరీక్ష కేంద్రం నుంచి బైక్‌పై వెళ్తున్న సమయంలో.. బైక్‌పై నుంచి కింద పడి మృతి చెందింది. మృతురాలిని పంచాయతీ కార్యదర్శిగా గుర్తించారు. ఈ ఘటన ధారూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం..

Telangana: గ్రూప్ 1 పరీక్ష రాసి ఇంటికి వెళ్తుండగా విషాదం.. మహిళా అభ్యర్ధి మృతి
Panchayat Secretary Died In A Road Accident
Srilakshmi C
|

Updated on: Jun 10, 2024 | 10:09 AM

Share

బొంరాస్‌పేట, జూన్‌ 10:

ఆదివారం జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష రాసి ఇంటికి తిరిగి వెళ్లుండగా ఓ అభ్యర్ధి మార్గం మధ్యలో కన్నుమూసింది. పరీక్ష కేంద్రం నుంచి బైక్‌పై వెళ్తున్న సమయంలో.. బైక్‌పై నుంచి కింద పడి మృతి చెందింది. మృతురాలిని పంచాయతీ కార్యదర్శిగా గుర్తించారు. ఈ ఘటన ధారూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. ధారూరు పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..

బొంరాస్‌పేట మండలంలోని దేవులనాయక్‌తండాకు చెందిన సుమిత్రాబాయి (32) అనే మహిళ యాలాల మండలంలోని అచ్యుతాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె ఆదివారం జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష రాసేందుకు భర్త నెహ్రూనాయక్‌తో కలిసి బైక్‌పై వికారాబాద్‌కు వెళ్లింది. ఎగ్జామ్‌ రాసిన తర్వాత అక్కడి నుంచి తాండూరుకు తిరిగి వెళ్తున్న క్రమంలో గట్టేపల్లితండా సమీపంలో వర్షం కురుస్తుండటంతో సుమిత్రబాయి గొడుగు తెరిచి పట్టుకుంది. బలమైన ఈదురు గాలులు వీచడంతో గొడుగు లేచిపోయింది. దీంతో బైక్‌ అదుపుతప్పడంతో బైక్‌ పై నుంచి సుమిత్రా బాయి కిందపడిపోయింది. ఈ ఘటనలో సుమిత్రా బాయి తలకు బలమైన గాయం అయ్యింది. దీంతో ఆమెను తాండూరు జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. మృతురాలి భర్త నెహ్రూనాయక్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అతడిని కూడా తాండూరు దవాఖానకు తరలించగా అక్కడ వైద్యులు చికిత్స అందించారు. నెహ్రూనాయక్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నెహ్రూనాయక్‌ బీఆర్‌ఎస్‌ మండల ఉపాధ్యక్షుడిగా, మండల సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జిగా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రమాదవార్త తెలియగానే కొడంగల్‌ తాలూకా సేవాలాల్‌ సంఘం అధ్యక్షుడు దేశ్యానాయక్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు తాండూరు దవాఖానకు చేరుకుని మృతురాలి భర్తను పరామర్శించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో