AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: విగ్గు రాజా.. వీడు మామూలోడు కాదు.. ఏకంగా 50 మందిని..

అందమైన ఫోటోలు, ఆకర్షణీయమైన వివరాలతో తనను ఐఏఎస్, ఐపీఎస్ వంటి హోదాల్లో ఉన్న వ్యక్తిగా చూపిస్తాడు. వివాహం కోసం క్రమంగా సంబంధిత అమ్మాయి తల్లిదండ్రులతో చర్చలు మొదలుపెట్టి వారి నమ్మకాన్ని పొందుతాడు. తాను తీరా పెళ్లికి సిద్ధమయ్యాననగానే ఆర్థిక సమస్యల పేరుతో పెద్ద మొత్తంలో డబ్బు అడుగుతాడు.

Hyderabad: విగ్గు రాజా.. వీడు మామూలోడు కాదు.. ఏకంగా 50 మందిని..
Man wearing wig cheats 50 women
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Dec 19, 2024 | 12:29 PM

Share

హైదరాబాద్ లో నిత్యపెళ్లికొడుకు వంశీకృష్ణపై మరోసారి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తప్పుడు వేషధారణతో, విగ్‌లు పెట్టుకుని, మ్యాట్రిమోని వెబ్‌సైట్లను వేదికగా చేసుకుని, అమాయకులను మోసం చేస్తూ దోచుకుంటున్న అతడి మోసాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 50 మంది అమ్మాయిల తల్లిదండ్రులను మోసపుచ్చి కోట్ల రూపాయలు కాజేసిన వంశీకృష్ణ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వంశీకృష్ణ మొదట మ్యాట్రిమోని వెబ్‌సైట్లలో ప్రొఫైల్స్ సృష్టిస్తాడు. అందమైన ఫోటోలు, ఆకర్షణీయమైన వివరాలతో తనను ఐఏఎస్, ఐపీఎస్ వంటి హోదాల్లో ఉన్న వ్యక్తిగా చూపిస్తాడు. వివాహం కోసం క్రమంగా సంబంధిత అమ్మాయి తల్లిదండ్రులతో చర్చలు మొదలుపెట్టి వారి నమ్మకాన్ని పొందుతాడు. తాను తీరా పెళ్లికి సిద్ధమయ్యాననగానే ఆర్థిక సమస్యల పేరుతో పెద్ద మొత్తంలో డబ్బు అడుగుతాడు.

తాజాగా, గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన ఓ ప్రముఖ డాక్టర్ కుమార్తెను పెళ్లి చేసుకుంటానని వంశీకృష్ణ మాటిచ్చాడు. ఆమె తండ్రిని నమ్మించి రూ.40 లక్షలు తీసుకున్నాడు. అయితే, డబ్బు విషయంలో మరోసారి ఒత్తిడి చేయడంతో, ఆమె తండ్రికి అనుమానం కలిగింది. ఈ సమయంలో వంశీకృష్ణ, ఆ మహిళా డాక్టర్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి పరువు తీయుతానంటూ బెదిరించడం ప్రారంభించాడు.

వంశీకృష్ణకు ఇదే తొలి కేసు కాదు. గతంలోనూ పలు నగరాల్లో ఇలా మోసాలకు పాల్పడి అరెస్టయి జైలుకు వెళ్లి వచ్చాడు. కానీ జైలులో నుంచి బయటకు వచ్చిన వెంటనే కొత్త మోసాల కోసం సిద్ధమవుతాడు. కొంతమంది అమ్మాయిల తల్లిదండ్రులు ఆయన మోసానికి బలై తాము మొత్తం ఆస్తి కోల్పోయారని చెప్పుకున్నారు. ఈ పరిస్థితుల్లో, వారు పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసినా, వంశీకృష్ణ తాను వినియోగిస్తున్న విభిన్న వేషాలు, టెక్నాలజీ కారణంగా పోలీసులు కూడా అతనిని పట్టుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు.

ఈ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే వంశీకృష్ణపై పలు ఆధారాలను సేకరించింది. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా అతని వెబ్‌సైట్ ప్రొఫైల్స్, బ్యాంకు లావాదేవీలు, ఫోన్ రికార్డులు వంటి వాటిని పరిశీలిస్తున్నారు. అతని చిట్కాలు, మార్గాలు తెలుసుకోవడానికి అతడి చరిత్రను తిరగేస్తున్నారు.

మ్యాట్రిమోని వెబ్‌సైట్ల ద్వారా సంబంధాల కోసం ప్రయత్నిస్తున్న తల్లిదండ్రులు ఆచితూచి వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు. సంబంధం కుదిరే ముందు వ్యక్తి గురించి సంపూర్ణంగా విచారించి నమ్మకమైన వర్గాల ద్వారా ధ్రువీకరణ పొందాలని సిఫార్సు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..