AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సికింద్రాబాద్‌ సన్‌షైన్‌ ఆస్పత్రిలో దారుణం.. కోవిడ్‌తో వ్యక్తి మృతి.. 3 రోజులకు రూ.9 లక్షల బిల్లు.. కుటుంబీకుల ఆందోళన

Coronavirus: కరోనా మహమ్మారి తెస్తున్న తంటాలు అన్నీ ఇన్నీ కావు. గత ఏడాదిగా కరోనా వెంటాడుతూ ప్రాణాలు తీస్తోంది. కోవిడ్‌తో ఎందరో మృత్యువాత పడుతున్నారు. ఇదే..

సికింద్రాబాద్‌ సన్‌షైన్‌ ఆస్పత్రిలో దారుణం.. కోవిడ్‌తో వ్యక్తి మృతి.. 3 రోజులకు రూ.9 లక్షల బిల్లు.. కుటుంబీకుల ఆందోళన
Subhash Goud
| Edited By: |

Updated on: May 29, 2021 | 11:20 AM

Share

Coronavirus: కరోనా మహమ్మారి తెస్తున్న తంటాలు అన్నీ ఇన్నీ కావు. గత ఏడాదిగా కరోనా వెంటాడుతూ ప్రాణాలు తీస్తోంది. కోవిడ్‌తో ఎందరో మృత్యువాత పడుతున్నారు. ఇదే అదనుగా చేసుకుని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు రోగుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరిన పేషంట్లపై లక్షల్లో డబ్బులు వసూలు చేస్తుండటంతో ఆందోళన నెలకొంటోంది. రోగి మృతి చెందితే కొన్ని ప్రైవేటు ఆస్పతులు బిల్‌ పూర్తిగా పే చేస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామంటూ చెప్పడంతో బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా సికింద్రాబాద్‌లోని సన్‌షైన్‌ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. కోవిడ్‌తో సుభాష్‌ చంద్రబోస్‌ అనే పేషెంట్ మృతి చెందాడు. మూడు రోజులకు 9 లక్షల రూపాయలు బిల్లు వేసిన ఆస్పత్రి యాజమాన్యం.. ఆరు లక్షలు కట్టినప్పటికీ మరో 3.5 లక్షల రూపాయలు కడితేనే మృతదేహాన్ని అప్పగిస్తామంటూ ఆస్పత్రి యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతోందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న మీడియా సిబ్బంది ఆస్పత్రి వద్దకు చేరుకోగానే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇచ్చేశారు. అయితే ఇలా ప్రైవేటు ఆస్పత్రులు దోపిడీలకు పాల్పడుతున్నట్లు ప్రభుత్వానికి అందుతున్న ఫిర్యాదుల్లో సన్‌షైన్‌ ఆస్పత్రి పేరుంది.

ఇవీ కూడా చదవండి:

Boat Accident: ఆ పడవ ప్రమాదంలో 60 మంది మృతి.. 83 మంది వరకు గల్లంతు.. వెల్లడించిన అధికారులు

Black Fungus Cases: వణికిస్తున్న బ్లాక్‌ ఫంగస్‌.. ఆ రాష్ట్రంలో ఒకే రోజు 133 ఫంగస్‌ కేసులు.. 18 మంది మృతి..!

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి