Heatwave: బస్తీ‘మే’ సవాల్.. నిప్పులు కక్కుతున్న సూరీడు.. వామ్మో.. వచ్చే 4 రోజులు బయటకు రాకపోవడమే బెటర్..

మే నెల వచ్చేసింది. మాడు పగిలిపోతోంది.. బయటికెళ్తే ఎండ, వేడి మూమూలుగా లేవు..! అప్పుడే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. నిప్పుల కొలిమిలా మండుతున్న ఎండల ధాటికి ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. వడగాలులు, ఉక్కపోత ఠారెత్తిస్తున్నాయ్‌. పలుచోట్ల 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Heatwave: బస్తీ‘మే’ సవాల్.. నిప్పులు కక్కుతున్న సూరీడు.. వామ్మో.. వచ్చే 4 రోజులు బయటకు రాకపోవడమే బెటర్..
Heat Wave Alert
Follow us

|

Updated on: May 01, 2024 | 1:17 PM

మే నెల వచ్చేసింది. మాడు పగిలిపోతోంది.. బయటికెళ్తే ఎండ, వేడి మూమూలుగా లేవు..! అప్పుడే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. నిప్పుల కొలిమిలా మండుతున్న ఎండల ధాటికి ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. వడగాలులు, ఉక్కపోత ఠారెత్తిస్తున్నాయ్‌. పలుచోట్ల 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాయలసీమ, ఉత్తర తెలంగాణలో ఎండ తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరింది. అయితే మరో 4 రోజులపాటు ఎండలు మరింత పెరగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరగడంతోపాటు.. తీవ్ర వడగాలులు వీచే అవకాశముంది. తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు వడగాలులు తప్పవని, ఎండల తీవ్రత కూడా పెరిగే అవకాశముందని పేర్కొంది. హైదరాబాద్‌లో పెరిగిన ఎండతీవ్రత నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో సైతం ఎండలు మండుతున్నాయి. చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే.. ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప, తిరుపతి జిల్లాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అంచనా వేసింది. అటు కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, బాపట్ల జిల్లాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి.

తెలంగాణ, ఏపీ అనే కాదు.. దేశంలోని చాలా ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారిపోయాయి. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 45డిగ్రీల మార్కును దాటి.. ఎక్కువగా నమోదవుతున్నాయి. గత ఏడాది నమోదైన రికార్డులను బద్దలు కొడుతూ వేసవిలో దేశం భగభగ మండిపోతోంది. ఈ వేడి వాతావరణానికి కారణం కాలుష్యం, తత్ఫలితంగా జరుగుతున్న వాతావరణ మార్పులు అని నిపుణులంతా చెప్పే సమాధానం..

సమ్మర్‌ హీట్‌.. ఎలక్షన్‌ హీట్‌..

మొత్తంగా.. ఆంధ్రా, తెలంగాణల్లో సమ్మర్‌ హీట్‌.. ఎలక్షన్‌ హీట్‌.. రెండూ ఓ రేంజ్‌లో ఉన్నాయ్‌.. ఇటు చూస్తే ఎలక్షన్లు.. ఇంట్లో కూర్చుంటే ఓట్లు పడవ్‌.. అటు చూస్తే మండే ఎండలు.. బయటికెళ్తే మంటెక్కిపోతోంది.. ఈ పరిస్థితుల్లో అభ్యర్థులు, కార్యకర్తలు, బహిరంగసభలకు వచ్చే జనాలు ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
గంభీర్..ఫ్లెమింగ్ కాదు.. టీమిండియా కోచ్ రేసులో మరో దిగ్గజ ప్లేయర్
గంభీర్..ఫ్లెమింగ్ కాదు.. టీమిండియా కోచ్ రేసులో మరో దిగ్గజ ప్లేయర్
ప్రపంచంలో అతి అరుదైన బ్లడ్ గ్రూప్స్.. ఎక్కడ ఎలా దొరుకుతాయంటే..
ప్రపంచంలో అతి అరుదైన బ్లడ్ గ్రూప్స్.. ఎక్కడ ఎలా దొరుకుతాయంటే..
మళ్లీ పటాస్ ప్రవీణ్‌తో జబర్దస్త్ ఫైమా..కొత్త లవర్‌ను పరిచయం చేసి
మళ్లీ పటాస్ ప్రవీణ్‌తో జబర్దస్త్ ఫైమా..కొత్త లవర్‌ను పరిచయం చేసి
ఎదుటివారిలో ఈ లక్షణాలు కనిపిస్తే అబద్దాలు చెబుతున్నారని అర్ధమట
ఎదుటివారిలో ఈ లక్షణాలు కనిపిస్తే అబద్దాలు చెబుతున్నారని అర్ధమట
ఆ కాంట్రవర్సీలో ఇరుక్కున్న పాయల్ రాజ్‌పుత్.. కెరీర్‌పై ఎఫెక్ట్.
ఆ కాంట్రవర్సీలో ఇరుక్కున్న పాయల్ రాజ్‌పుత్.. కెరీర్‌పై ఎఫెక్ట్.
ఫైనల్‌కు వెళ్లేదెవరు?KKRతో క్వాలిఫైయర్ మ్యాచ్.. టాస్ గెలిచిన SRH
ఫైనల్‌కు వెళ్లేదెవరు?KKRతో క్వాలిఫైయర్ మ్యాచ్.. టాస్ గెలిచిన SRH
బోనస్‌పై కాంగ్రెస్ మాట మార్చిందా? కొనుగోళ్లలో U ట్యాక్స్‌ నిజమేనా
బోనస్‌పై కాంగ్రెస్ మాట మార్చిందా? కొనుగోళ్లలో U ట్యాక్స్‌ నిజమేనా
మాకొచ్చే సీట్ల విషయంలో క్లారిటీతో ఉన్నాం.. బొత్స కీలక వ్యాఖ్యలు
మాకొచ్చే సీట్ల విషయంలో క్లారిటీతో ఉన్నాం.. బొత్స కీలక వ్యాఖ్యలు
కిర్గిస్థాన్‌లో అల్లర్లు.. ఉలిక్కిపడ్డ విజయనగరం.. తమ పిల్లల కోసం
కిర్గిస్థాన్‌లో అల్లర్లు.. ఉలిక్కిపడ్డ విజయనగరం.. తమ పిల్లల కోసం
యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు.. మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు.. మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు