రోజు రోజు పార్టీ కల్చర్ హంగామా ఎక్కువైపోతోంది. యువత కొత్తపుంతలు తొక్కుతూ.. పెడదారి పడుతోందని ఇప్పటికే కొంతమంది వాదిస్తున్నారు. ఇక ప్రధాన నగరాల్లో పబ్బులు అరాచకం చాలా ఎక్కువైపోతున్నాయి. జల్సాలకు అలవాటు పడిన యువతను ఆకర్షిస్తూ కొంతమంది గలీజ్ దందాలను నడిపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్(Hyderabad) లోని పబ్బుల్లో జరుగుతున్న అరాచకాలు నిత్యం మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఇక పబ్బుల్లో డ్రగ్స్ వాడుతూ నానా రచ్చ చేస్తున్నారు కొందరు. పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేసినా కొన్ని పబ్బుల నిర్వాహకులు మాత్రం వాటిని పట్టించుకోకుండా అరాచలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని ఓ పబ్ గలీజు దందాకు తెరలేపిందని పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ లోని కేపీహెచ్బీ ని ఓ పబ్ అశ్లీల దందా నడిపిస్తోందని పోలీసులు వెల్లడించారు. పోలీసులు పలుమార్లు దాడులు చేసినా క్లబ్ మస్తీ వ్యవహారం మారలేదు.. లీజు దందాకు తెరలేపింది కేపీహెచ్బీలోని క్లబ్ మస్తీ పబ్. ఇప్పటికే ఈ పబ్ పై పోలీసులు చాలా సార్లు దాడి చేశారు. ఆయినా కూడా క్లబ్ మస్తీ వ్యవహారం మార్చుకోవడం లేదు. పబ్ చాటున పెద్ద అశ్లీల దందా నడిపిస్తున్నారు. అర్ధరాత్రి 2 గంటల వరకు చెవులు చిల్లులు పడేలా డీజే సౌండ్స్తో అశ్లీల నృత్యాలు, రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. చుట్టుప్రక్కల వారు కంప్లెయింట్ చేసిన కూడా క్లబ్ మస్తీ నిర్వాహకులు తమ తీరు మార్చుకోవడం లేదు అంటున్నారు స్థానికులు..