AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: అమాయకపు చూపుల చిన్నారి ఇప్పుడు నిర్మాతలకు చుక్కలు చూపిస్తుంది.. ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా స్టార్ అయ్యింది..

పైన ఫోటోలో అమాయకపు చూపులతో కట్టిపడేస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు దక్షిణాది ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్. మొదటి సినిమాతోనే పాన్ ఇండియా లెవల్లో

Viral Photo: అమాయకపు చూపుల చిన్నారి ఇప్పుడు నిర్మాతలకు చుక్కలు చూపిస్తుంది.. ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా స్టార్ అయ్యింది..
Actress
Rajitha Chanti
|

Updated on: Jul 29, 2022 | 8:05 PM

Share

బాల్యం ఓ మధురమైన జ్ఞాపకం. చిన్ననాటి అందమై జ్ఞాపకాలు ఫోటోలలో రూపంలో పదిలంగా ఉంటాయి. ముఖ్యంగా పసిపిల్లలుగా ఉన్నప్పటి ఫోటోస్ ఇప్పటికీ చాలా మంది వద్ద ఉంటాయి. వాటిని అపురూపంగా భద్రపరుచుకుంటారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలో ఆ బాల్యం తాలుకూ అందమైన జ్ఞాపకాలను తన సన్నిహితులకు, స్నేహితులకు షేర్ చేస్తుంటారు. ఇప్పుడు నెట్టింట్లో ఇలాంటి ఫోటోస్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. సామాన్య ప్రజలే కాకుండా ఇటీవల సెలబ్రెటీలు కూడా తమ బాల్యస్మృతులను సోషల్ మీడియా వేదికగా ఫాలోవర్లతో పంచుకుంటున్నారు. ఇప్పటికే పలువురు హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్, అరుదైన చిత్రాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇప్పుడు క్యూట్ చిన్నారి ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఎవరా చిన్నారి ? మీరు గుర్తుపట్టండి.

పైన ఫోటోలో అమాయకపు చూపులతో కట్టిపడేస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు దక్షిణాది ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్. మొదటి సినిమాతోనే పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాదు.. రెమ్యునరేషన్ విషయంలోనూ నిర్మాతలకు చుక్కలు చూపిస్తుంది. గుర్తుపట్టండి. ఈ చిత్రంలో ఉన్న అందమైన చిన్నారి మరెవరో కాదు. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి. కేజీఎఫ్ చిత్రంలో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ అందుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం రెమ్యునరేషన్ భారీగా పెంచేసింది. ఇటీవల తమిళ్ స్టార్ విక్రమ్ సరసన కోబ్రా సినిమాలో నటించింది. ఈ చిత్రానికి కేజీఎఫ్ కంటే రెండింతలు ఎక్కువగా పారితోషికం తీసుకుందని టాక్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.