AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Secunderabad: రైల్వే స్టేషన్‌లో తేడాగా కనిపించిన ప్యాసింజర్.. అతని లగేజ్ చెక్ చేయగా..

కంత్రీగాళ్లు.. ఖతర్నాక్ గాళ్లు.. ఇంకా ఏం పేర్లు పెట్టాలి వీళ్లకి. క్రైమ్ చేయడానికి వినూత్న మార్గాలను ఎన్నుకుంటున్నారు. కొంచెం కూడా భయం లేకుండా తమ పనులు కానిచ్చేస్తున్నారు. రైళ్లను,. బస్సులను కూడా అక్రమ కార్యాకలాపాలకు వినియోగించుకుంటున్నారు.

Secunderabad: రైల్వే స్టేషన్‌లో తేడాగా కనిపించిన ప్యాసింజర్.. అతని లగేజ్ చెక్ చేయగా..
Secunderabad Railway Station
Ram Naramaneni
|

Updated on: May 29, 2024 | 6:03 PM

Share

కంత్రీగాళ్లు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్‌ను కూడా వదలడం లేదు. ఆర్టీసీ బస్సులను, రైళ్లను కూడా తమ అక్రమ కార్యకలాపాలకు యధేచ్చగా వినియోగించుకుంటున్నారు. పోలీసులు అంటే కనీసం భయం లేకుండా పోయింది. ఇంతలా తనిఖీలు జరుగుతున్నా కూడా తమను ఆపేవాడే లేడు అన్నట్లు బిహేవ్ చేస్తున్నారు. సోమవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో  గంజాయి తరలిస్తున్న వ్యక్తిని రైల్వే పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.15.5 లక్షల విలువైన 62 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఒడిశాలోని గజపతి జిల్లాకు చెందిన చాంద్ కుమార్ నాయక్ (30)గా గుర్తించారు. అతడిని అక్కడికక్కడే అరెస్టు చేయగా, మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు.

నాయక్ ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సోమవారం ఉదయం ప్లాట్‌ఫారమ్‌లు, రైళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 10వ నంబర్ ప్లాట్‌ఫాంపై ఒడిశాలోని మోహనా నుంచి మహారాష్ట్రలోని నాందేడ్‌కు గంజాయిని తరలిస్తుండగా నాయక్‌ పట్టుబడ్డాడని పోలీసులు తెలిపారు. నిషిద్ధ వస్తువులు ఉన్న రెండు ట్రాలీ సూట్‌కేసులు, మూడు షోల్డర్ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని గజపతి జిల్లాకు చెందిన చిదాతో పాటు మరో ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. రైల్వే పోలీస్ సూపరింటెండెంట్ షేక్ సలీమా, ఆమె డిప్యూటీ ఎస్ఎన్ జావేద్ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరిగింది. సికింద్రాబాద్‌ జీఆర్‌పీ అధికారులు, సిబ్బంది కృషికి రైల్వే అదనపు డైరెక్టర్‌ జనరల్‌ మహేశ్‌ భగవత్‌ అభినందనలు తెలిపారు.

ఇది కూడా చదవండి: చనిపోయి కనిపించిన కొండచిలువ.. శవపరీక్షలో పొట్ట కోయగా.. వామ్మో..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..  

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..