AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Annapurna Meals: జీహెచ్ఎంసీ ప‌రిధిలోని అన్న‌పూర్ణ క్యాంటీన్ల‌లో ఉచిత భోజ‌నం.. మంత్రి కేటీఆర్ కీల‌క ఆదేశాలు

కొవిడ్ నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పది రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయించడంతో గ్రేటర్ హైదరాబాద్ లోని నిరాశ్రయులు, చిరువ్యాపారులు....

Annapurna Meals: జీహెచ్ఎంసీ ప‌రిధిలోని అన్న‌పూర్ణ క్యాంటీన్ల‌లో ఉచిత భోజ‌నం.. మంత్రి కేటీఆర్ కీల‌క ఆదేశాలు
Annapurna Canteen
Ram Naramaneni
|

Updated on: May 18, 2021 | 8:31 AM

Share

కొవిడ్ నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పది రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయించడంతో గ్రేటర్ హైదరాబాద్ లోని నిరాశ్రయులు, చిరువ్యాపారులు, బీద వారికి అన్నపూర్ణ కేంద్రాల ద్వారా రోజూ 45 వేల మందికి భోజన సౌకర్యాన్ని జీహెచ్ఎంసీ అందిస్తోంది. నగరంలో ప్రస్తుతం ఉన్న 250 అన్నపూర్ణ కేంద్రాల ద్వారా నగరంలోని అన్నార్తులకు రోజు ఐదు రూపాయల భోజనాన్ని జీహెచ్ఎంసీ కల్పిస్తోంది. తాజాగా ఈ కేంద్రాలలో ఉచితంగా భోజ‌నం అందించాల‌ని మంత్రి కేటీఆర్ అధికారుల‌కు సూచించారు. ఈరోజు నుంచే ఫ్రీగా మీల్స్ అందించాల‌ని సూచించారు. త‌దుప‌రి ఉత్త‌ర్వులు వ‌చ్చేవ‌ర‌కు ఇదే విధానం కొన‌సాగించాల‌న్నారు.

వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకై రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డంతో ర‌వాణా వ్య‌వ‌స్థ నిలిచిపోయింది. ఎక్క‌డ ఉన్న ప్ర‌జ‌లు అక్క‌డే ఉండిపోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. వ‌ర్త‌క వ్యాపార సంస్థ‌లు, విద్యాల‌యాలు, ప‌రిశ్ర‌మ‌లు మూసివేయ‌డంతో ఇబ్బందిక‌ర ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో ఇబ్బంది ప‌డుతున్న వ‌ల‌స కార్మికులు, చిరుద్యోగులు, రోజువారి కూలీలు, నిరాశ్ర‌యులు, వ‌స‌తి గృహాల‌లో ఉంటున్న విద్యార్థులు, ఉద్యోగుల‌ను ఆదుకునేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ముందుకు వ‌చ్చింది. ప్రస్తుత లాక్ డౌన్ లో మరిన్ని అన్నపూర్ణ కేంద్రాలను తెరచి అవసరమైన వారికందరికి అన్నపూర్ణ భోజనాన్ని అందిస్తోంది. ప్ర‌ధాన‌ ఆసుప‌త్రులు, బ‌స్టాండ్‌లు, రైల్వే స్టేష‌న్లు, కూలీల అడ్డాలు, జంక్షన్లు ఉన్న ప్రాంతాల‌లో అన్న‌పూర్ణ కేంద్రాలు న‌డుస్తున్నాయి. ప్ర‌తి భోజ‌నంలో 450 గ్రాముల అన్నం, 100 గ్రాముల ప‌ప్పు, సాంబార్‌, ప‌చ్చ‌డి త‌ప్ప‌నిస‌రిగా ఉండే విధంగా మెనూను అమ‌లు చేస్తున్నారు. స‌మ‌తుల పోష‌క ప‌దార్థాల‌తో అందిస్తున్న అన్న‌పూర్ణ ఉచిత భోజ‌నం ప‌ట్ల వ‌ల‌స కార్మికులు, నిరాశ్ర‌యులు, విద్యార్థులు, చిరుద్యోగులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ ఆక‌లి తీర్చేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం, జీహెచ్ఎంసీ చొర‌వ‌ను అభినందిస్తున్నారు.

Also Read:  ఏపీలో బ్లాక్ ఫంగస్ టెన్ష‌న్.. మార్కాపురంలో 6 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు

తెలంగాణ ఎంసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా..