AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం ఇదే..

వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, చర్చించాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్ పలువురు ఎమ్మెల్యేలతో ప్రగతి భవన్ లో చర్చించారు. ప్రభుత్వ పరంగా ప్రజలకు చెప్పాల్సిన విషయాలను....

అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం ఇదే..
Sanjay Kasula
|

Updated on: Aug 26, 2020 | 10:38 PM

Share

చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న యూనివర్సిటీల వైస్ చాన్సెలర్ల నియామకాలకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. వీసీల నియామకానికి సంబంధించి ఇప్పటికే సెర్చ్ కమిటీల నియామకం పూర్తయిందని, వీసీల ఎంపికకు సంబంధించిన కసరత్తు చేస్తున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీసీల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

అయితే వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, చర్చించాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్ పలువురు ఎమ్మెల్యేలతో ప్రగతి భవన్ లో చర్చించారు. ప్రభుత్వ పరంగా ప్రజలకు చెప్పాల్సిన విషయాలను, అసెంబ్లీ వేదికగా వివరించాలని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. అదే విధంగా పలు ప్రజోపయోగ కార్యక్రమాలపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, విప్ లు గొంగిడి సునిత, రేగ కాంతారావు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్థన్, చల్లా ధర్మారెడ్డి, గణేష్ గుప్త, సండ్ర వెంకట వీరయ్య తదితరులు పాల్గొన్నారు.