GHMC: గ్రేటర్లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వార్.. తొలి రోజే తగువుకు రెడీ అవుతున్న వైరీ పక్షాలు..
జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కార్పొరేటర్ల మధ్య వార్ నడుస్తోంది. ఇద్దరికి సమానమైన బలం ఉండటంతో పరస్పర ఆరోపణలు హీటెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య పోరుకు శనివారం జరగనున్న కౌన్సిల్ వేదిక అవుతోంది.
BJP – TRS: జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కార్పొరేటర్ల మధ్య వార్ నడుస్తోంది. ఇద్దరికి సమానమైన బలం ఉండటంతో పరస్పర ఆరోపణలు హీటెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య పోరుకు శనివారం జరగనున్న కౌన్సిల్ వేదిక అవుతోంది. కోవిడ్ తర్వాత మొదటిసారి జరగనున్న జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం కోసం వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. గ్రేటర్లో చాలా సమస్యలు ఉన్నాయి.. కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని పదే పదే బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. మేయర్ అపాయింట్మెంట్ ఇవ్వరూ..కౌన్సిల్ నిర్వహించరంటూ ఇటీవల బీజేపీ కార్పొరేటర్లు మేయర్ ఆఫీసులో హంగామా సృష్టించారు. వారిపై కేసులు కూడా నమోదయ్యాయి.
ఈ దాడిని టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఖండించారు. ఐతే శనివారం జరిగే కౌన్సిల్ మీటింగ్లో రెండు పార్టీల కార్పొరేటర్లు కలవబోతున్నారు. దీంతో కౌన్సిల్ సమావేశం సజావుగా జరుగుతుందా..? లేక రచ్చ..రచ్చ.. అవుతుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రెండు పార్టీలు ఎవరి వ్యూహాలతో వాళ్లు కౌన్సిల్ సమావేశానికి రాబోతున్నారు. మేయర్ ఆఫీస్పై దాడికి బీజేపీ కార్పొరేటర్లు క్షమాపణ చెబితేనే సమావేశంలో మాట్లాడించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. మంత్రి తలసాని ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కార్పొరేటర్లు సమావేశం నిర్వహించి వ్యూహం రచించారు.
అటు బీజేపీ నేత లక్ష్మణ్ ఆధ్వర్యంలో బీజేపీ కార్పొరేటర్లు మీట్ అయ్యి…పక్కా వ్యూహంతో వస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కౌన్సిల్ హాల్లో టీఆర్ఎస్-బీజేపీ-ఎంఐఎం కార్పొరేటర్లకు ప్రత్యేక సీట్లు ఏర్పాటు చేశారు. సమావేశానికి రావడానికి మేయర్-ఇతర అధికారులకు ఒక దారి.. కార్పొరేటర్లకు మరో దారిని ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి: మీ ఇంటికి బిర్యానీ ఎవరు తెచ్చారో ఓ సారి చూడండి.. డెలివరీ బాయ్ కాదండోయ్..
Rakesh Jhunjhunwala: 10 సెకెన్లలో రూ. 318 కోట్లు మాయం.. దలాల్ స్ట్రీట్లో దగాపడిన బిగ్ బుల్..