AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ కాంగ్రెస్‌లో కుల రాజకీయాలు.. ఎటూ తేలని పంచాయితీ.. తెరపైకి కర్ణాటక ఫార్మూలా.?

తెలంగాణ కాంగ్రెస్‌లో మరో కొత్త వివాదం మొదలైంది.. మెజారిటీ ప్రజలుగా మేమున్నా తమకి టికెట్ల కేటాయింపుల విషయంలో ఆది నుండి అన్యాయం జరుగుతుందంటూ..

తెలంగాణ కాంగ్రెస్‌లో కుల రాజకీయాలు.. ఎటూ తేలని పంచాయితీ.. తెరపైకి కర్ణాటక ఫార్మూలా.?
Telangana Congress
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Jul 06, 2023 | 7:44 PM

Share

తెలంగాణ కాంగ్రెస్‌లో మరో కొత్త వివాదం మొదలైంది.. మెజారిటీ ప్రజలుగా మేమున్నా తమకి టికెట్ల కేటాయింపుల విషయంలో ఆది నుండి అన్యాయం జరుగుతుందంటూ బీసీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. బిసిలకు జనాభా దామషా ప్రకారం టికెట్ల కేటాయింపునకు అధిష్టానం సానుకూలంగా ఉన్నా.. రాష్ట్ర నేతలు మాత్రం భిన్నంగా వ్యవహారిస్తున్నారు.. ఇంతకీ గాంధీ భవన్‌లో బీసీల పంచాయతీ ఎటు తేల్చబోతున్నారు…? కర్ణాటక ఫార్ములా అమలు చేస్తారా..?

దూకుడుగా వెళ్తున్న తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీల చిచ్చు మొదలైంది. తమకి సరైన సీట్లు కేటాయించాలంటూ కొద్ది రోజులుగా బీసీలు రహస్య సమావేశాలు ఏర్పాటు చేస్తూ నేతలను టికెట్లపై తాడోపేడో తేల్చుకోవాలంటూ హెచ్చరిస్తున్నారు. బీసీలకు జనాభా దామషా ప్రకారం టికెట్లు కేటాయించాలని టికెట్లు మా హక్కు అని బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో టికెట్ల విషయంలో మోసపోయామని ఇప్పుడు ముందుగానే టికెట్లు ప్రకటించాలని కోరుతున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 3 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.. బీసీలకు టికెట్ల విషయంలో హైకమాండ్ సానుకూలంగా ఉన్నప్పటికీ రాష్ట్ర నేతల వ్యవహార శైలి సరిగా లేదని బీసీ నేతలు మండిపడుతున్నారు.

బీసీ నేతలకు టికెట్ల విషయంలో సీనియర్ నేత విహెచ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కి, పొన్నాల లక్ష్మయ్య, చెరుకు సుధాకర్ లాంటి వారు తమకి అన్యాయం జరుగుతోందని బీసీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో బీసీలకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందేనని పార్టీ అంతర్గత చర్చల్లో డిమాండ్ చేస్తున్నారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో మూడు సీట్లకు తగ్గకుండా బీసీలకు అసెంబ్లీ టికెట్ల ఇవ్వాలనే డిమాండ్ చేసున్నారు. రాష్ట్రంలో బీసీల జనాభా దామాషా ప్రకారం కనీసం 40 – 45 వరకు అడుగుతున్నారు..

పార్టీలో కొన్ని కులాల వారి పెత్తనం వల్ల బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సరైన ప్రాతినిధ్యం ఉండడం లేదని, దీని వల్లే పార్టీ మెజార్టీ ప్రజల ముందు ఇబ్బంది పడుతోందని కాంగ్రెస్ బీసీ నేతలు చెబుతున్నారు. కర్ణాటకలో బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం వల్లే అక్కడ మెజార్టీ బీసీలు కాంగ్రెస్ వైపు నిలబడ్డారని, తెలంగాణలోనూ అదే స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయాలని కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారు. మరోవైపు కొందరు ఎస్సీ, ఎస్టీ నేతలు కూడా ఈసారి జనరల్ సీట్లలో పోటీకి సిద్దమని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీలో ఇదొక హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి టికెట్ల ముందుగానే ప్రకటించి బీసీల ప్రాధాన్యత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో ఈ కొత్త చర్చ ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.

Follow Us
పుదీనా మొక్కను ఇంట్లో పెంచుకోవడం ఎలా..? గుబురుగా పెరగాలంటే..
పుదీనా మొక్కను ఇంట్లో పెంచుకోవడం ఎలా..? గుబురుగా పెరగాలంటే..
ఈ ఆలయానికి వెళ్లి దీక్ష తీసుకుంటే.. మద్యపానం జోలికే వెళ్లరు..!
ఈ ఆలయానికి వెళ్లి దీక్ష తీసుకుంటే.. మద్యపానం జోలికే వెళ్లరు..!
చంద్రగ్రహణం: దోషాలు తొలగించి.. శుభ ఫలితాలు ఇచ్చే రెమెడీ ఇదే..
చంద్రగ్రహణం: దోషాలు తొలగించి.. శుభ ఫలితాలు ఇచ్చే రెమెడీ ఇదే..
రోకో ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆఫ్ఘాన్‌తో వన్డే సిరీస్‌‌కు రెడీ
రోకో ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆఫ్ఘాన్‌తో వన్డే సిరీస్‌‌కు రెడీ
రూ.10 వేలతో ఈ బిజినెస్‌ స్టార్ట్‌ చేయొచ్చు! లాభాలే లాభాలు
రూ.10 వేలతో ఈ బిజినెస్‌ స్టార్ట్‌ చేయొచ్చు! లాభాలే లాభాలు
చమురు సరఫరా ఆగిపోతే దేశంలో పెట్రోల్ నిల్వలు ఎన్ని రోజులు ఉంటాయి?
చమురు సరఫరా ఆగిపోతే దేశంలో పెట్రోల్ నిల్వలు ఎన్ని రోజులు ఉంటాయి?
బ్లాక్ బస్టర్ మూవీ మిస్ చేసుకున్న వైష్ణవి..
బ్లాక్ బస్టర్ మూవీ మిస్ చేసుకున్న వైష్ణవి..
బయట రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు ఏపీ గురించి సలహాలు.. ఇవ్వొద్దు
బయట రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు ఏపీ గురించి సలహాలు.. ఇవ్వొద్దు
చమురు రవాణాకు గేట్వే మూసివేత.. గ్లోబల్ మార్కెట్లలో కల్లోలం..!
చమురు రవాణాకు గేట్వే మూసివేత.. గ్లోబల్ మార్కెట్లలో కల్లోలం..!
ఇరాన్‌-అమెరికా యుద్ధం.. భారత్‌కు గుడ్‌న్యూస్‌!
ఇరాన్‌-అమెరికా యుద్ధం.. భారత్‌కు గుడ్‌న్యూస్‌!