Telangana: హైదరాబాద్ లో మరో దారుణం.. బాలికపై సామూహిక అత్యాచారం.. వీడియోలు తీసి, బెదిరించి ఘాతుకం
హైదరాబాద్(Hyderabad) మహానగరంలో దారుణాలు, దాడులు, అత్యాచారాలు, హత్యలు, దొంగతనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో బాలికలపై వేధింపులు, అత్యాచారాలు జరగడం...
హైదరాబాద్(Hyderabad) మహానగరంలో దారుణాలు, దాడులు, అత్యాచారాలు, హత్యలు, దొంగతనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో బాలికలపై వేధింపులు, అత్యాచారాలు జరగడం ఆందోళనకరంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్(Jubilee Hills) సామూహిక అత్యాచార ఘటన మరవకముందే నగరంలో మరో దారుణం జరిగింది. తాజాగా కార్ఖానా పరిధిలో ఓ బాలికపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ధీరజ్, రితేశ్ అనే ఇద్దరు యువకుడు బాధిత బాలికతో ఇన్స్టాగ్రామ్లో పరిచయం పెంచుకున్నారు. ఆ పరిచయాన్ని ఆసరాగా తీసుకుని మాటలు కలిపి దగ్గరయ్యారు. బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. ఈ సమయంలో వీడియో తీసి బెదిరింపులకు తెర లేపారు. బాధితురాలు వీడియోలు ఇవ్వాలని కోరగా.. తమ స్నేహితులకూ సహకరించాలని షరతు విధించారు. అంతేకాకుండా వారితో కలిసి మరోసారి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా ఈ ఘటన ఈ ఘటన దాదాపు రెండు నెలల క్రితం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఘటన జరిగినప్పటి నుంచి బాలిక ముభావంగా ఉండటాన్ని గమనించిన కుటుంబసభ్యులు మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. అతడి వద్ద బాలిక జరిగిన విషయాన్నంతా వివరించింది. అవాక్కైన బాలిక తల్లిదండ్రులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టి ఐదుగురిని అరెస్టు చేశారు. నిందితుల్లో ఓ బాలుడు కూడా ఉన్నట్లు గుర్తించారు. నలుగురిపై పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. బాలుడిని జువైనల్ హోం కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి