అమీర్పేట – హైటెక్సిటీ మెట్రో రైలు పరుగుకు ముహుర్తం ఫిక్స్
హైదరాబాద్: ఎంతోకాలంగా ఎదురు చూస్తోన్న అమీర్పేట – హైటెక్సిటీ మార్గంలో మెట్రో రైలు పరుగులు పెట్టడానికి ముహుర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 20 నుంచి ఈ మార్గంలో సేవలు ప్రారంభించనున్నట్టు మెట్రో అధికారులు వెల్లడించారు. దీంతో అమీర్పేట నుంచి హైటెక్సిటీకి సుమారు 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ప్రముఖ కార్పోరేట్ సంస్థలు, ఐటీ సంస్థలు, సాప్ట్ వేర్ కంపెనీస్ హైటెక్సిటీ ప్రాంతంలోనే ఉండటంతో ఈ మార్గంలో నిత్యం వాహనాల రద్దీతో ట్రాఫిక్ భారీగా జామవుతుంది. ఈ మార్గంలో […]
హైదరాబాద్: ఎంతోకాలంగా ఎదురు చూస్తోన్న అమీర్పేట – హైటెక్సిటీ మార్గంలో మెట్రో రైలు పరుగులు పెట్టడానికి ముహుర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 20 నుంచి ఈ మార్గంలో సేవలు ప్రారంభించనున్నట్టు మెట్రో అధికారులు వెల్లడించారు. దీంతో అమీర్పేట నుంచి హైటెక్సిటీకి సుమారు 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ప్రముఖ కార్పోరేట్ సంస్థలు, ఐటీ సంస్థలు, సాప్ట్ వేర్ కంపెనీస్ హైటెక్సిటీ ప్రాంతంలోనే ఉండటంతో ఈ మార్గంలో నిత్యం వాహనాల రద్దీతో ట్రాఫిక్ భారీగా జామవుతుంది. ఈ మార్గంలో మెట్రో రైలు మార్గం పూర్తికావడంతో ట్రాఫిక్ సమస్యకు ఇక తెరపడనుంది. ఈ మార్గంలో మొత్తం ఎనిమిది స్టేషన్లు ఉన్నాయి. అమీర్పేట, మధురానగర్, యూసఫ్గూడ, జూబ్లీహిల్స్ రోడ్ నం -5, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గం చెరువు, హైటెక్సిటీ. హైదరాబాద్ మహా నగరంలోని మొత్తం మూడు మెట్రో రైలు కారిడార్లలో 56 కి.మీల వరకు మెట్రో సేవలు పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు.