ఎంత మంది హీరోయిన్స్ వచ్చినా ఈ బ్యూటీ క్రేజ్ తగ్గడం లేదు..
Rajitha Chanti
Pic credit - Instagram
30 January 2026
సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మృణాల్ ఠాకూర్. మొదటి చిత్రంతోనే సీతమహాలక్ష్మీ పాత్రతో మెప్పించింది.
ఈ మూవీ తర్వాత హాయ్ నాన్న సినిమాతో మరో హిట్టు ఖాతాలో వేసుకుంది. నటిగా మెప్పించినా ఈ బ్యూటీకి అంతగా ఆఫర్స్ రాలేదు.
ముజ్సే కుచ్ కెహ్తీ యే ఖామోషియా అనే సీరియల్ ద్వారా నటిగా తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు హీరోయిన్ గా సత్తా చాటుతుంది.
కుంకుమ భాగ్య సీరియల్ ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు కథానాయికగా దూసుకుపోతుంది.
జర్నలిజం చేసిన ఈ అమ్మడు నెమ్మదిగా మోడలింగ్ వైపు అడుగులు వేసింది. ఆ తర్వాత హిందీలో వరుస సినిమాల్లో నటించి మెప్పించింది.
జెర్సీ సినిమాతో ఈ బ్యూటీకి హిందీలో ప్రశంసలు వచ్చాయి. ప్రస్తుతం తెలుగులో అడివి శేష్ సరసన డెకాయిట్ చిత్రంలో నటిస్తుంది.
మరోవైపు ధనుష్ తో ప్రేమ, పెళ్లి అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ ప్రచారంపై మృణాల్ ఇంతవరకు అధికారికంగా రియాక్ట్ కాలేదు.
అలాగే ఇండస్ట్రీలో ఈ అమ్మడు పేరు మారుమోగుతుంది. అటు సోషల్ మీడియాలో వరుస పోస్టులతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్