Hyderabad: శిర్టి వెళ్లిన భర్త.. భార్య ఫోన్ చేస్తే స్విచ్చాప్.. ఇంట్లో దొరికిన లేఖతో స్టన్.. ఫ్రెండ్ భార్యతో

|

Jun 02, 2023 | 4:55 PM

శిర్డీ వెళ్తున్నానని ఇంట్లో చెప్పి ఓ వ్యక్తి తన ఫ్రెండ్ భార్యను తీసుకుని జంప్ అయ్యాడు. ఈ విషయం తన మిత్రుడికి కూడా తెలుసు అని ట్విస్ట్ ఇచ్చాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Hyderabad: శిర్టి వెళ్లిన భర్త.. భార్య ఫోన్ చేస్తే స్విచ్చాప్.. ఇంట్లో దొరికిన లేఖతో స్టన్.. ఫ్రెండ్ భార్యతో
Elopement Case (Representative image)
Follow us on

సొసైటీలో జరిగే క్రైమ్స్‌ను గమనించండి. 90 శాతం ఘటనలకు కారణం వివాహేతర, అక్రమ సంబంధాలే. కాపురాలు కూలిపోతున్నాయి. హత్యలు, ఆత్మహత్యల వరకు వెళ్తుంది వ్యవహారం. పిల్లలు అనాథలవుతున్నారు. పరాయి వ్యక్తుల మోజులో పడి.. సమాజంలో దోషుల్లా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. పెళ్లి సమయంలో చేసిన ప్రమాణాలను మర్చిపోతున్నారు చాలామంది. మూడుముళ్ల బంధం మూడునాళ్ల ముచ్చటైపోతుంది. ఇటీవల తెలంగాణలో ఓ ప్రభుత్వ టీచర్‌కు, యువకుడితో మిస్డ్ కాల్ ద్వారా అయిన పరిచయం ఏ పరిస్థితి దారి తీసిందో చూశాం. రెండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 2 కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి.

ఈ ఘటన గురించి చర్చ జరుగుతుండగానే హైదరాబాద్‌లో మరో ఇన్సిడెంట్ వెలుగుచూసింది. న్యూబోయిన్‌పల్లి చెందిన  వ్యాపారి తన ఫ్రెండ్ భార్యతో జంప్ అయ్యాడు. తమను వెతకొద్దంటూ తన భార్యకు లేఖ రాసి మరి పరారయ్యాడు. శిర్డీ వెళ్తున్నాను అని ఇంట్లో చెప్పి.. గత నెల 29న  ఫ్రెండ్ భార్యను తీసుకుని వెళ్లాడు వ్యాపారి అతుల్. ఆ నెక్ట్స్ డే నుంచి అతడి ఫోన్ స్విచ్ఛాప్ వచ్చింది. దీంతో అతుల్ భార్య ఆందోళన చెందింది. ఓ వైపు భర్త సమాచారం కోసం ట్రై చేస్తూనే.. ఇంట్లో వెతగ్గా ఓ లెటర్ కనిపించింది. అది చదవిన అతుల్ భార్య స్టన్ అయ్యింది. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

తన ఫ్రెండ్ భార్యతో వెళ్లిపోతున్నానని… ఆ విషయం తన మిత్రుడుకి కూడా తెలుసునని, తమ కోసం వెతకవద్దన్నది అతుల్ లేఖ సారాంశం. దీంతో అతుల్ భార్య పోలీసులను ఆశ్రయించింది. తన భర్త ఇంట్లో రూ. 10 లక్షలు తీసుకొని ప్రియురాలితో వెళ్లిపోయాడని కంప్లైంట్ చేసింది. పోలీసులు దర్యాప్తు షురూ చేశారు. సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా అతడి లోకేషన్ ట్రేస్ చేసే పనిలో పడ్డారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం