మొరిపిరాల లవ్ చీటింగ్ కేసులో కొత్త కోణాలు.. సందీప్ కుమార్‌ను బలితీసుకున్న హానీ ట్రాప్.!

 స్రవంతి... కావ్య... మనీషా... ఈ పేర్లు చదివితే మొత్తం ముగ్గురు అనుకుంటున్నారా? కానే కాదు. ఈ ముగ్గురూ ఒక్కరే. అవును, మీరు విన్నది నిజమే. ఒకే అమ్మాయ్, మూడు పేర్లతో అబ్బాయిలతో

మొరిపిరాల లవ్ చీటింగ్ కేసులో కొత్త కోణాలు.. సందీప్ కుమార్‌ను బలితీసుకున్న హానీ ట్రాప్.!
Wgl Honey Trap
Follow us

|

Updated on: Aug 23, 2021 | 11:46 AM

స్రవంతి… కావ్య… మనీషా… ఈ పేర్లు చదివితే మొత్తం ముగ్గురు అనుకుంటున్నారా? కానే కాదు. ఈ ముగ్గురూ ఒక్కరే. అవును, మీరు విన్నది నిజమే. ఒకే అమ్మాయ్, మూడు పేర్లతో అబ్బాయిలతో సినిమా స్టైల్లో ఆడేసుకుంటోంది. కొందరిని ప్రేమ పేరుతో.. మరికొందరిని హానీ ట్రాప్ చేస్తోంది. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని అందమైన ఫొటోలతో యువకులను ముగ్గులోకి దింపుతోన్న ఈ కిలాడీ లేడీ అందినకాడికి డబ్బు గుంజుతోంది. అయితే, ఇదేమీ తెలియని ఓ అమాయక అబ్బాయి.. ఆమె నిజంగానే ప్రేమిస్తుందనుకుని చివరికి సూసైడ్ చేసుకున్నాడు. తెలంగాణలోనే జరిగిన లవ్ చీటింగ్ అండ్ వెరైటీ హానీ ట్రాప్ కథ ఒకసారి చూద్దాం.

వరంగల్ యువకుడు సందీప్ సూసైడ్ కేసులో హానీ ట్రాప్ వ్యవహారం బయటికి వచ్చింది. మొదట స్రవంతి పేరుతో పరిచయమై.. ఆ తర్వాత కావ్య, మనీషా, శిరీష పేర్లతో మాట్లాడింది ఆమేనని తేలింది. పోలీసుల దర్యాప్తులో కళ్లు బైర్లు కమ్మే విషయాలు బయటపడుతున్నాయ్. ఒకే అమ్మాయి ప్రేమ పేరుతో సందీప్ ను వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.

వరంగల్ జిల్లా రాయపర్తిలో అమ్మాయిల ప్రేమ వేధింపులతో యువకుడు సందీప్ సూసైడ్ చేసుకున్నాడు. అయితే, దీని వెనుక క్రైమ్ మూవీని మించిన స్టోరీ బయటపడింది. ప్రేమ నాటకం ఆడింది.. ఆ తర్వాత వేధించిందీ ముగ్గురు కాదు.. ఒకే అమ్మాయిగా తేలింది. ఒకే అమ్మాయి మూడు నెంబర్లతో సందీప్ ను ట్రాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కనిపిస్తూ ఒక అమ్మాయిలా.. కనిపించకుండా మరో ఇద్దరిలా ఫోన్ లో మాట్లాడుతూ సందీప్ ను వేధించింది.

వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం మొరిపాల గ్రామానికి చెందిన సందీప్.. మహబూబాబాద్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. తన అక్క క్లాస్ మేట్ అయిన స్రవంతితో పరిచయం ఏర్పడింది. స్రవంతి ప్రేమిస్తున్నానంటూ చెప్పడంతో ఇద్దరూ రోజూ ఫోన్ లో మాట్లాడుకునేవారు. ఇక్కడే కథ అసలు మలుపు తిరిగింది. తన అసలు ప్లాన్ ను అమలు చేయడం మొదలుపెట్టింది. కావ్య, మనీషా పేర్లతో ఫోన్లు చేసి ప్రేమిస్తున్నట్లు చెప్పింది. ఇలా మూడు పేర్లతో సందీప్ ను ఓ ఆట ఆడుకుంది.

అయితే, ప్రేమ మాయలో పడిన సందీప్.. ఒకే అమ్మాయి ముగ్గురిలా మాట్లాడుతోందని గుర్తించలేకపోయాడు. అయితే, ఇక్కడ ఓ లాజిక్ ఉంది. స్రవంతి మాత్రమే డైరెక్ట్ గా కనబడేది. మిగతా ఇద్దరు ఎవరో తెలుసుకోకుండానే సందీప్ ఫోన్లో మాట్లాడేవాడు. ఇదే ఆమెకు అడ్వాంటేజ్ గా మారింది. అయితే, సందీప్ తో లవ్ ట్రాక్ నడుపుతూనే మరొకరిని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది స్రవంతి. ఆ తర్వాత మరో డ్రామా స్టార్ట్ చేసింది. పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించడం మొదలుపెట్టింది. ఇదంతా తెలిసిన సందీప్.. స్రవంతి లవ్ చీటింగ్‌ను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

Read also:  యువ పారిశ్రామికవేత్త రాహుల్ మర్డర్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.. సీన్ లోకి మహిళలు ఎందుకొచ్చారనేదే ఇప్పుడు సస్పెన్స్