Telangana: జొన్న పంట రైతులకు సీఎం కేసీఆర్‌ గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

రైతుల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రైతుల ఏవిధమైన నష్టపోకుండా ఉండేందుకు వారికి అంగడా నిలిచేందుకు చర్యలు చేపడుతున్నారు. రైతులకు మద్దతు ధర విషయంలో కీలక ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధరను ప్రకటిస్తున్నారు..

Telangana: జొన్న పంట రైతులకు సీఎం కేసీఆర్‌ గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Cm Kcr
Follow us

|

Updated on: May 12, 2023 | 6:26 PM

రైతుల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రైతుల ఏవిధమైన నష్టపోకుండా ఉండేందుకు వారికి అంగడా నిలిచేందుకు చర్యలు చేపడుతున్నారు. రైతులకు మద్దతు ధర విషయంలో కీలక ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధరను ప్రకటిస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పండిన యాసంగి జొన్న పంటకు మద్దతు ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే సేకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు మార్క్ ఫెడ్ ను రాష్ట్ర నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ, 2022-23 యాసంగి సీజన్‌లో పండించిన జొన్న(హైబ్రిడ్) పంటను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి మార్క్ ఫెడ్ ఎండి చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

యాసంగి సీజన్‌లో పండిన మొత్తం 65,494 మెట్రిక్ టన్నుల జొన్న పంటను కొనుగోలు చేసేందుకు కావాల్సిన రూ.219.92 కోట్ల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు గ్యారెంటి ఇవ్వనున్నది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామరెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, గద్వాల్ జిల్లాల పరిధిలో జొన్న పంటను పండించిన దాదాపు లక్షమంది రైతులకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ద్వారా లబ్ది చేకూరనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి