Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‎గా ఎంపికైన తొలి దళిత నేత.. అభినందనలు తెలిపిన శాసన సభ్యులు

తెలంగాణలో మరోసారి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత రెండో సారి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించారు. గతంలో రేవంత్ రెడ్డితో సహా మిగిలిన మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ రోజు శాసనసభ సభాపతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న నేపథ్యంలో మరోసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. ముందుగా ప్రోటెం స్పీకర్ అక్భరుద్దీన్ ఓవైసీ గడ్డం ప్రసాద్‎ను అసెంబ్లీ స్పీకర్‎గా అధికారికంగా ప్రకటించారు.

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‎గా ఎంపికైన తొలి దళిత నేత.. అభినందనలు తెలిపిన శాసన సభ్యులు
Gaddam Prasad Telangana Ass
Follow us

|

Updated on: Dec 14, 2023 | 11:50 AM

తెలంగాణలో మరోసారి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత రెండో సారి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించారు. గతంలో రేవంత్ రెడ్డితో సహా మిగిలిన మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ రోజు శాసనసభ సభాపతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న నేపథ్యంలో మరోసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. ముందుగా ప్రోటెం స్పీకర్ అక్భరుద్దీన్ ఓవైసీ గడ్డం ప్రసాద్‎ను అసెంబ్లీ స్పీకర్‎గా అధికారికంగా ప్రకటించారు. ఆ తరువాత స్పీకర్‎గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‎కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గడ్డం ప్రసాద్‎ను స్పీకర్ గా ఎంపిక చేయడంపై అన్ని పార్టీలు సహకరించాయన్నారు. అసెంబ్లీ స్పీకర్‎గా తొలి సారి దళిత నేతను ఎంపిక చేయడం చాల సంతోషంగా ఉందన్నారు. సభాపతిని పోడియం వరకూ తీసుకెళ్లి స్పీకర్ చైర్‎లో కూర్చోబెట్టి పుష్పగుచ్ఛాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ తరువాత క్యాబినెట్ మంత్రులు ఒక్కొక్కరుగా పోడియం వద్దకు వెళ్లి స్పీకర్‎కు శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, దానం నాగేందర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు కరచాలనం చేస్తూ అభినందనలు అందజేశారు.

గడ్డం ప్రసాద్ రాజకీయ ప్రస్థానాన్ని ఒక్క సారి పరిశీలించినట్లయితే ఎంపీటీసీగా తొలి అడుగు వేసి.. నేడు శాసనసభాపతిగా ఎన్నికయ్యారు. ఈయన 21 ఏళ్ల ప్రాయంలోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఈయన 1964లో మర్పల్లిలో జన్మించారు. 1984లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి 2008 ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. వికారాబాద్‎లో అఖండ విజయాన్ని సాధించారు. 2009లో మరోసారి ఎమ్మెల్యేగా విజయం తన ఖాతాలో వేసుకొని 2012లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా ఓటములు చవిచూడాల్సి వచ్చింది. 2022లో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడిగా గడ్డం ప్రసాద్‎ను నియమించారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్‌ నుంచి పోటీలో నిల్చొని మరోసారి గెలుపొందారు.

ఇవి కూడా చదవండి

స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్‌ అభ్యర్థిత్వానికి బీజేపీకి మినహా మిగిలిన అన్ని పార్టీల మద్దతు లభించింది. ఆయనకు 63 మంది కాంగ్రెస్‌ సభ్యులు, 39 మంది బీఆర్‌ఎస్‌ సభ్యులు, ఏడుగురు ఎంఐఎం, సీపీఐకి చెందిన ఒక ఎమ్మెల్యే మద్దతు లభించినట్టయ్యింది. దీంతో ఏకగ్రీవంగా ఎన్నికై సభాపతి స్థానంలో కూర్చున్నారు గడ్డం ప్రసాద్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..