డంపింగ్ యార్డ్ కింద శివాలయం 500 ఏళ్లైనా చెక్కు చెదరలేదు..
బిహార్ రాజధాని పాట్నాలో 500 సంవత్సరాల పురాతన శివాలయం బయట పడింది. డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని శుభ్రపరుస్తుండగా వార్డ్ నెం. 54లో ఈ పురాతన దేవాలయాన్ని కనుగొన్నారు. ఈ స్థలం ఒకప్పుడు మఠానికి అనుసంధానంగా ఉండేదని చెబుతున్నారు. ఈ ఘటన స్థానికంగా ఆసక్తి కలిగించింది. స్థానికులు పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి తరలివస్తున్నారు.
స్థానికులు స్వయంగా తవ్వకాలు చేపట్టారు. శిథిలాలు తొలగించగా..ఆలయ పూర్తి నిర్మాణం వెలుగు చూసింది. అందరూ కలిసి ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచారు. లోపల, ఒక పురాతన శివలింగం, రెండు ప్రత్యేకమైన పాదముద్రలు ఉన్నాయి. ఆలయ గోడలపై అంతుచిక్కని విధంగా నీటి చెమ్మ రావడాన్ని స్థానికులు గుర్తించారు. ఎంతో సుందరంగా అప్పట్లో నల్లరాతితో ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతున్నారు. అప్పటివరకు చెత్తకుప్పగా ఉన్న ఆ స్థలం.. అంతలోనే ప్రార్థనా స్థలంగా మారిపోయింది. ప్రస్తుతం ఈ ఆలయం గురించి పురావస్తు శాఖ అధికారులు పరిశోధనలు చేపట్టారు. ఈ ఆలయం 15వ శతాబ్దానికి చెందినదిగా నిపుణులు భావిస్తున్నారు. ఈ శివాలయం గురించి వార్తలు వైరల్ అయినప్పటి నుంచి, చాలా మంది ప్రజలు..పూజలు చేసేందుకు ఆ ప్రాంతానికి వస్తున్నారు. పూలు, పాలు, స్వీట్లు సమర్పిస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. మొత్తం తవ్వకం పూర్తికాకముందే కొందరు ఆ ప్రాంతాన్ని పూలతో అలంకరించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాలయ్యతో నటించిన ఈ చిన్నారి ఎవరో తెలుసా ??
అభిమానులకు బాలయ్య ఫోన్.. పట్టరాని సంతోషంలో ఫ్యాన్స్
Daaku Maharaaj: డాకు మహారాజ్ ఊచకోత.. బాలయ్య సినిమా రెండురోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
గేమ్ ఛేంజర్ సినిమాపై కుట్ర.. పోలీస్ స్టేషన్లో కేసు
పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు.. ఇమ్యూనిటీని పెంచుకోండి ఇలా !!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

