AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డీఎస్‌కు ప్రాణహాని ఉంది.. ఆయన చుట్టూ ఉన్న వాళ్లపై నాకు అనుమానం.. ఎంపీ అర్వింద్‌పై డి.సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు..

డీఎస్‌పై కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు ప్రాణహాని ఉందన్నారు. ఆయన చుట్టూ ఉన్న వాళ్లపై తనకు అనుమానం ఉందన్నారు. మా నాన్నను నిజామాబాద్ ఎంపీ అర్వింద్ బ్లాక్ మెయిల్ చేసి లేఖపై..

డీఎస్‌కు ప్రాణహాని ఉంది.. ఆయన చుట్టూ ఉన్న వాళ్లపై నాకు అనుమానం.. ఎంపీ అర్వింద్‌పై డి.సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు..
D.Sanjay
Sanjay Kasula
|

Updated on: Mar 27, 2023 | 6:12 PM

Share

ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంపై ఆయన కుమారుడు డి.సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎస్‌పై కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు ప్రాణహాని ఉందన్నారు. ఆయన చుట్టూ ఉన్న వాళ్లపై తనకు అనుమానం ఉందన్నారు. మా నాన్నను నిజామాబాద్ ఎంపీ అర్వింద్ బ్లాక్ మెయిల్ చేసి లేఖపై సంతకం చేయించారని తెలిపారు. ఆస్తులు కూడా బెదిరించి రాయించుకున్నారని అన్నారు. డీఎస్ రాజీనామా చేసిన సంతకం కూడా ఫేక్ అని అన్నారు. డీఎస్‌ను రూమ్‌లో బంధించి సంతకం చేయించుకున్నారని అంటున్నారు డి.సంజయ్. మా నాన్న ఫోన్ కూడా లిఫ్ట్ చేయించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జనం అంతా గమనిస్తున్నారని.. తన తండ్రిని బ్లాక్ మెయిల్ చేసి ఆస్తులు రాయించుకున్నారని విమర్శించారు. దీని వెనుక ఎంపీ అర్వింద్ ఉన్నారని విమర్శించారు. మా అమ్మకు రాజకీయాలు తెలియవన్నారు. తను తమ్ముడు, ఎంపీ అర్వింద్ మాటలు నమ్ముతుందన్నారు.

డీఎస్ చేరిక, రాజీనామాపై కాంగ్రెస్ నేతలు ఒకరి తర్వాత ఒకరు స్పందించారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తనకే సమాచారం లేదన్నారు మహేష్‌గౌడ్‌. ఎవరిని అడిగి చేర్చుకున్నారో కూడా తెలియదన్నారు. డీఎస్ చేరిక వల్ల పార్టీకి వచ్చే లాభం లేదన్నారు. డి.సంజయ్‌కి అర్బన్ టికెట్ హామీ ఎవరిచ్చారో క్లారిటీ లేదన్నారు. తనకు కూడా అర్బన్ టికెట్ హామీ ఇచ్చారని.. రాజకీయాల్లో క్యారెక్టర్ అనేది చాల ముఖ్యం అని అన్నారు. చేరడానికి ఒక గంట ముందు సమాచారమిచ్చారన్నారు.డిసిసి అధ్యక్షుడు లేకుండా ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు మానాల మోహన్ రెడ్డి.

డీఎస్ రాజీనామాపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. డీఎస్‌ను తాము పార్టీలోకి ఆహ్వానించలేదన్నారు. నీ కొడుకు సంగతి ఏంటని తాను ప్రశ్నించినట్లుగా తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీని బద్నాం చేస్తున్నారని విమర్శించారు. ఇంటి సమస్యలు ఇంట్లో తేల్చుకోవాలన్నారు. కుటుంబవ్యవహారాన్ని పార్టీకి ఆపాదించడం సరికాన్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరడం డీఎస్ ఏమన్నారంటే..

తాను కాంగ్రెస్‌లో చేరినట్లు వస్తున్న వార్తలను ధర్మపురి శ్రీనివాస్‌ ఖండించారు. తనను వివాదాల్లోకి లాగొద్దని స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ కూడా రాశారు. ఆదివారం నా కుమారుడు డి.సంజయ్‌ కాంగ్రెస్‌లో చేరారని.. సంజయ్‌తోపాటు తాను కూడా గాంధీ భవన్‌కు వెళ్లినట్లుగా తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ వారు తనకు కూడా కండువా కప్పి పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం చేశారని.. ఒకవేళ తాను కాంగ్రెస్‌లో చేరినట్లు భావిస్తే.. ఇదే లేఖను రాజీనామాగా తీసుకోవాలన్నారు డీఎస్‌. వయసురీత్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం