AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డెంగ్యూ నివారణకు ప్రజల భాగస్వామ్యం అవసరం : మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌లో డెంగ్యూ జ్వరాలు వ్యాపించడంపై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు అన్నిరకాల సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. డెంగ్యూ వ్యాపించడానికి ప్రధానంగా  ఇళ్లలో నిల్వ ఉండే నీరే కారణమని, మురికి కాలువలు, సీవరేజ్  కారణం కాదన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది ఉన్నప్పటికీ నగర వాసులు ఈ సమస్యపై ఎవరికి వారు  స్పందిస్తే తప్ప పరిష్కారం కాదన్నారు. మున్సిపల్ శాఖ విభాగాధిపతులతో మంత్రి కేటీఆర్ సమావేశమై పలు విషయాలపై […]

డెంగ్యూ నివారణకు  ప్రజల భాగస్వామ్యం అవసరం : మంత్రి కేటీఆర్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 09, 2019 | 6:31 PM

Share

హైదరాబాద్‌లో డెంగ్యూ జ్వరాలు వ్యాపించడంపై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు అన్నిరకాల సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. డెంగ్యూ వ్యాపించడానికి ప్రధానంగా  ఇళ్లలో నిల్వ ఉండే నీరే కారణమని, మురికి కాలువలు, సీవరేజ్  కారణం కాదన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది ఉన్నప్పటికీ నగర వాసులు ఈ సమస్యపై ఎవరికి వారు  స్పందిస్తే తప్ప పరిష్కారం కాదన్నారు.

మున్సిపల్ శాఖ విభాగాధిపతులతో మంత్రి కేటీఆర్ సమావేశమై పలు విషయాలపై చర్చించారు. నగరంలో పెరుగుతున్న డెంగ్యూ జ్వరాలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మంత్రి వర్గం నిర్ణయంతో బస్తీ దవాఖానాల సంఖ్య పెంచుతామని, ఈ దవాఖానాల్లో సాయంత్రం సమయాల్లో కూడా ఓపీ సేవలు అందుబాటు ఉంటాయని, జీహెచ్‌ఎంసీ పరిధిలో సీజనల్ వ్యాధులపై 12 నెలలపాటు అనుసరించాల్సిన క్యాలెండర్ రూపొందించినట్టు ఆయన తెలిపారు. దీనిద్వారా అధికారులు, సిబ్బంది, ప్రజలు ఎవరు ఏం చేయాలో నిర్దేశించినట్టు చెప్పారు కేటీఆర్.

రేపటి నుంచి రోజుకు మూడు అవగాహన సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు కేటీఆర్. ఈ సమావేశాల ద్వారా అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు. పారిశుద్యం, దోమల నివారణపై ఇప్పటికే అన్ని విభాగాల అధిపతులతో చర్చించామని, ఎలాంటి భయాందోళనకు గురికావద్దన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు మంత్రి కేటీఆర్.

వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం