AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: జస్ట్ రేటింగ్ ఇస్తే డబ్బు వచ్చేస్తుంది.. నమ్మారో ఖేల్ ఖతం అంతే

బాబోయ్ ప్రజంట్ ఇంటర్నెట్ యుగం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మోసాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఓటీపీ అని ఒకడు.. బ్యాంక్ క్రెడిట్ కార్డు అని ఒకడు.. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని ఒకడు.. రాంగ్ ప్లేసుకు డెలివరీ చేశామని మరొకరు ఇలా మోసాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. ప్రస్తుతం అయితే రేటింగ్స్ వ్యవహారం ట్రెండింగ్‌లో ఉంది. తొలుత మనీ రాగానే అబ్బా డబ్బులు అని ఆశపడే.. నిలువునా మోసపోతారు తస్మాత్ జాగ్రత్త. దీనిపై మీ ఫ్రెండ్స్‌కు, ఫ్యామిలీ మెంబర్స్‌కు కూడా చెప్పండి.

Hyderabad: జస్ట్ రేటింగ్ ఇస్తే డబ్బు వచ్చేస్తుంది.. నమ్మారో ఖేల్ ఖతం అంతే
Cyber Fraud
Follow us
Ranjith Muppidi

| Edited By: Ram Naramaneni

Updated on: Aug 10, 2023 | 10:03 AM

హైదరాబాద్, ఆగస్టు 10:  సైబర్ నేరగాళ్లు మరో కొత్త తరహా మోసానికి తెరలేపారు. వాట్సాప్‌లో రేటింగ్స్ ఇస్తే భారీగా డబ్బులు వస్తాయని అందిన కాడికి దోచుకుంటున్నారు. హైదరాబాద్ తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. గత నెల 31వ తేదీన యువతికి వాట్సాప్‌లో రేటింగ్ ఇవ్వాలంటూ ఓ కంపెనీ నుండి మెసేజ్ వచ్చింది. దీంతో ఆ లింక్ ఓపెన్ చేసిన వెంటనే అందులో ఒక ఆడియో సంభాషణ ఉంది. అందులో ఒక్కో మెసేజ్ కి రేటింగ్ ఇస్తే 50 రూపాయలు అకౌంట్ లో డిపాజిట్ అవుతాయని చెప్పడంతో బాధితురాలు నమ్మి అందులో రేటింగ్ ఇవ్వడం ప్రారంభించింది. ఇలా బాధితురాలికి మొదటగా 15000 అకౌంట్ లో డిపాజిట్ కావడంతో అది నమ్మి ఆ తర్వాత ఇతర స్నేహితులకు పంపి వారి ద్వారా కూడా రేటింగ్ ఇవ్వడం ప్రారంభించింది. ఇలా తన స్నేహితుల ద్వారా వచ్చిన డబ్బుకు రెండింతలు అందులో పెట్టుబడి పెట్టింది. కానీ ఆ తర్వాత రిటన్స్ మాత్రం ఒక్కసారిగా ఆగిపోయాయి.  మొదట డబ్బులు ఇస్తున్నట్లు నమ్మింది.. భారీగా పెట్టుబడి పెట్టగానే పత్తా లేకుండా ఆ డబ్బును కాజేస్తున్నారు కేటుగాళ్లు.

సైబర్ నెరగాళ్లు తిరిగి డబ్బులు చెల్లించకుండా చేతులు ఎత్తేయడంతో బాధితులు మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో మూడు చోట్ల ఇలాంటి ఫిర్యాదులు రావడంతో పోలీసులు వాట్సప్ రేటింగ్ మెసేజ్‌లపై అవగాహన కల్పిస్తున్నారు. ఇలాంటి లింకులు ఓపెన్ చేస్తే మోసపోక తప్పదని హెచ్చరిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇలాంటి కేసుల్లో నిందితుల అకౌంట్లో డబ్బులు పడగానే విత్ డ్రా చేస్తున్నట్టు పోలీసులు చెప్తున్నారు. దీంతో ఈ తరహా కేసుల్లో రికవరీ శాతం కూడా తక్కువగానే ఉంటుందంటున్నారు. అప్రమత్తంగా ఉండడం ద్వారానే ఈ తరహా మోసాలకు అడ్డుకట్ట వెయ్యొచ్చంటున్నారు.

బాబోయ్ ప్రజంట్ ఇంటర్నెట్ యుగం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మోసాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఓటీపీ అని ఒకడు.. బ్యాంక్ క్రెడిట్ కార్డు అని ఒకడు.. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని ఒకడు.. రాంగ్ ప్లేసుకు డెలివరీ చేశామని మరొకరు ఇలా మోసాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. ప్రస్తుతం అయితే రేటింగ్స్ వ్యవహారం ట్రెండింగ్‌లో ఉంది. తొలుత మనీ రాగానే అబ్బా డబ్బులు అని ఆశపడితే.. నిలువునా మోసపోతారు తస్మాత్ జాగ్రత్త. దీనిపై మీ ఫ్రెండ్స్‌కు, ఫ్యామిలీ మెంబర్స్‌కు కూడా చెప్పండి. వారికి మంచి చేసినవారు అవుతారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.