AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Corona: తెలంగాణలో తగ్గిన కరోనా సెకండ్ వేవ్ తీవ్రత.. అలాగని ఆదమరిచారో అంతే సంగతులు..

Telangana: తెలంగాణ లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గింది... అలా అని జాగ్రత్తలు మరిస్తే థర్డ్ వేవ్ ముప్పు తప్పదు అంటున్నారు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు.

Telangana Corona: తెలంగాణలో తగ్గిన కరోనా సెకండ్ వేవ్ తీవ్రత.. అలాగని ఆదమరిచారో అంతే సంగతులు..
Telangana Health Director S
Shiva Prajapati
|

Updated on: Aug 19, 2021 | 9:43 AM

Share

Telangana: తెలంగాణ లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గింది… అలా అని జాగ్రత్తలు మరిస్తే థర్డ్ వేవ్ ముప్పు తప్పదు అంటున్నారు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు. థర్డ్ వేవ్ వస్తే ఎరుర్కోవడనికి సిద్దంగా ఉన్నాం అని అంటూనే ప్రజలు జాగ్రతగా ఉండడం అవసరం అని గుర్తుచేస్తుంది తెలంగాణ వైద్య శాఖ.

‘‘పది రోజుల నుండి తెలంగాణలో కరోనా కేసులు అదుపులోకి వస్తున్నాయ్.. కొన్ని జిల్లాలో అసలు కరోనా కేసులు కూడా నమోదు అవడం లేదు. కానీ ఆదమరిస్తే ప్రమాదం తప్పదు’’ అని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ముగిసిపోయిందని, కానీ థర్డ్‌ వేవ్‌ రాకుండా కోవిడ్‌ మార్గదర్శకాలను పాటించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. కరోనా కేసులు తగ్గినా పోస్ట్ కోవిడ్ సమస్యలు ఎక్కువ మంది నీ వెంటాడుతుందన్నారు. కాబట్టి శరీరంలో వచ్చే ఎలాంటి మార్పు అయినా తేలిగ్గా తీసుకోవద్దు అని సూచించారు.

ఇక వర్షాలు పడుతుండడంతో జ్వరాలు, ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయని, వాటి తో జాగ్రతగా ఉండాలని నిపుణులు సూచించారు. ప్రస్తుతం తెలంగాణలో డెంగీ, మలేరియా కేసులు పెరుగుతున్నాయి. గతేడాది రాష్ట్రంలో 2,173 డెంగీ కేసులు నమోదైతే, ఈ ఏడాది ఇప్పటికే 1,200 నమోదయ్యాయి అని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వెల్లడించారు. ఇందులో 448 డెంగీ కేసులు హైదరాబాద్‌లో నమోదయ్యాయన్నారు. హైదరాబాద్ తో పాటు ఖమ్మం జిల్లాల్లో డెంగీ కేసులు అత్యధికంగా రాగా, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలో మలేరియా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి అని శ్రీనివాస్ రావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 220, ములుగు జిల్లాలో 120పైగా మలేరియా కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు.

ఎవరికైనా అనారోగ్యంగా అనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు. పెద్ద ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా ఫీవర్‌ క్లినిక్‌లను ఏర్పాటు చేశామని, డెంగీ చికిత్స కోసం 24 ప్లేట్‌లెట్‌ ఎలక్ట్రిక్‌ యంత్రాలను సిద్ధంగా ఉంచామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. పరిసరాల్లో నీళ్లు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. డెంగీ దోమ పగటి వేళలోనే కుడుతుందని, అందువల్ల ఇళ్లలోకి దోమలు రాకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు.

Follow Us
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై