Telangana: సీఎం రేవంత్ జిల్లాల టూర్ ఖరారు.. అక్కడి నుంచే తొలిపర్యటన..

|

Jul 08, 2024 | 6:51 AM

సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాల టూర్ షురూ కానుంది. పాలమూరు జిల్లా నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. గ్రామానాభివృద్ధే థ్యేయంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. తెలంగాణలో అధికారం చేపట్టాక సీఎం రేవంత్ రెడ్డి తనదైన దూకుడును ప్రదర్శిస్తున్నారు. మొన్నటి వరకూ పార్లమెంట్ ఎన్నికల హడావిడిలో గడిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పుడు పరిపాలన, అభివృద్ది పనులపై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా తానే స్వయంగా తెలంగాణలోని జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు.

Telangana: సీఎం రేవంత్ జిల్లాల టూర్ ఖరారు.. అక్కడి నుంచే తొలిపర్యటన..
CM Revanth Reddy
Follow us on

సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాల టూర్ షురూ కానుంది. పాలమూరు జిల్లా నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. గ్రామానాభివృద్ధే థ్యేయంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. తెలంగాణలో అధికారం చేపట్టాక సీఎం రేవంత్ రెడ్డి తనదైన దూకుడును ప్రదర్శిస్తున్నారు. మొన్నటి వరకూ పార్లమెంట్ ఎన్నికల హడావిడిలో గడిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పుడు పరిపాలన, అభివృద్ది పనులపై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా తానే స్వయంగా తెలంగాణలోని జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. మొన్న వరంగల్‎లో పర్యటించిన సీఎం రేవంత్ పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మరో హైదరాబాద్‎గా వరంగల్ ను తీర్చిదిద్దుతానంటున్నారు. అదే క్రమంలో ఇప్పుడు తన సొంత జిల్లా పాలమూరు నుంచి జిల్లాల టూర్‌ ప్రారంభిస్తున్నారు. ఈనెల 9న మహబూబ్‌నగర్‌ కి వెళ్లనున్నారు సీఎం రేవంత్. జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్ట్‌లు, విద్యా, వైద్యంపై రివ్యూ చేస్తారు. సీఎం రివ్యూలో ఉమ్మడి జిల్లాలోని ఐదుగురు కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొననున్నారు.

సీఎం పర్యటన నేపథ్యంలో మహబూబ్‌నగర్‌లో పర్యటించారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. తానే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాట్లు చెప్పారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న 1000 పడకల ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను పరిశీలించారు మంత్రి దామోదర్ రాజనరసింహ. ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయితో కలిసి హాస్సిటల్ పనులను, పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సర్కారు దవాఖానాను ప్రతి పేదవాడు ఓన్ చేసుకునేలా మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు మంత్రి. కొత్తగా నిర్మిస్తున్న ఆస్పత్రిలో సుమారు 600కు పైగా ఉద్యోగాల భర్తీ చేయాల్సి ఉందన్నారు. దానిపై చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామీణ స్థాయి నుంచి వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు మంత్రి. సీఎం పర్యటనలో ఉమ్మడి జిల్లాలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో చర్చిస్తామన్నారు మంత్రి దామోదర.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..