Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Revanth Reddy: టీఎస్‌పీఎస్సీ, ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనపరమైన అంశాల్లో దూకుడు పెంచారు. అనేక శాఖలకు సంబంధించి రివ్యూలు నిర్వహిస్తూ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మొదట వ్యవసాయం, రైతు భరోసా అంశాలపై సీఎం రేవంత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అధికారులు హాజరయ్యారు.

CM Revanth Reddy: టీఎస్‌పీఎస్సీ, ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
Revanth Reddy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 11, 2023 | 9:30 PM

సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనపరమైన అంశాల్లో దూకుడు పెంచారు. అనేక శాఖలకు సంబంధించి రివ్యూలు నిర్వహిస్తూ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మొదట వ్యవసాయం, రైతు భరోసా అంశాలపై సీఎం రేవంత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అధికారులు హాజరయ్యారు. అనంతరం టీఎస్‌పీఎస్సీ, ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై రివ్యూ చేశారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టీఎస్‌పీఎస్సీ భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలు, నోటిఫికేషన్లపై ఆరా తీశారు. పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

డ్రగ్స్ నియంత్రణపై అధికారులతో చర్చ

ఆ తర్వాత రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ మీద అధికారులతో చర్చించారు సీఎం రేవంత్‌. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం పెరుగుతోందంటూ ప్రజల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంతో.. వీటిని పూర్తిస్థాయిలో నియంత్రించడంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర నీటి పారుదలశాఖపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల వారీగా అధికారులతో రివ్యూ చేశారు. తెలంగాణలో నీటిపారుదల రంగానికి చాలా ప్రాధాన్యత ఉందని.. ప్రజల డబ్బులతో ప్రాజెక్టులను కడుతున్నామని అన్నారు. అత్యంత పారదర్శకంగా పనులు ఉండాలని.. అపోహలు తొలగిపోయేలా పని చేయాలని సూచించారు. మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు ఏర్పాట్లు చేయాలని నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులను మంత్రి ఉత్తమ్‌ ఆదేశించారు. ఇది చాలా తీవ్రమైన అంశమని తెలిపారు.

వ్యవసాయశాఖ అధికారులతో ఆ శాఖ మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. రైతుల సంక్షేమానికి అధికారులు పని చేయాలని.. మంచి పద్ధతులు, టెక్నాలజీ సాయంతో అధిక దిగుబడి ఉత్పత్తుల మార్కెటింగ్‌ కోసం కృషి చేయాలని అన్నారు. వాణిజ్య పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..