AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS CM KCR: నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్న సీఎం.. ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్‌

TS CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌ నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. సీఎం కేసీఆర్ పీటీఆర్ కాలనీలోని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల గాదరి కిశోర్ తండ్రి..

TS CM KCR: నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్న సీఎం.. ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్‌
Cm Kcr Nalgonda
Surya Kala
|

Updated on: Dec 29, 2021 | 2:57 PM

Share

TS CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌ నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. సీఎం కేసీఆర్ పీటీఆర్ కాలనీలోని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల గాదరి కిశోర్ తండ్రి మారయ్య మృతి చెందారు. మారయ్య దశదిన కర్మ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. దీంతో మారయ్య కుటుంబాన్ని ముఖ్యమంత్రి పరామర్శించి.. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.  మారయ్య చిత్రపటానికి కేసీఆర్ నివాళి అర్పించారు.

హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి నల్లగొండ జిల్లాకు వెళ్లారు కేసీఆర్‌. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ తండ్రి మారయ్య దశదినకర్మకు హాజరయ్యారు సీఎం. సీఎం కేసీఆర్ వెంట.. మంత్రులు జగదీష్ రెడ్డి, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ , ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు మారయ్యకు నివాళులర్పించారు. మ‌ధ్యాహ్నం భోజ‌నం చేసి తిరిగి హైద‌రాబాద్ కు ప్ర‌యనం అవుతారు.

Also Read: కరోనాను మించిన మహమ్మారి.. పాకిస్థాన్‌లో 7,462 మంది చిన్నారులు మృతి..